ఏపీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తుల విషయంపై ఒక సంస్థ తాజాగా జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 58 మంది ఉండగా.. 48 మంది ఆస్తులకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయని.. మిగిలిన 10 మంది ఎమ్మెల్సీల వివరాలు తమకు అందలేదని చెబుతోందిన సదరు సంస్థ. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీల వివరాల్లో అధికార వైసీపీకి 22 మంది ఉంటే.. విపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు.
తాము సేకరించిన వివరాల్ని విశ్లేషించినప్పుడు.. మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులుగా గుర్తించినట్లు చెబుతోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ. దీనితో పాటు ఏపీ ఎలక్షన్ వాచ్ కూడా అధ్యయనాన్ని నిర్వహించింది. ఏపీ ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడిగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిలిచారు. ఆయన ఆస్తి రూ.369 కోట్లకు పైనేనని తేల్చారు.
మండలిలో రెండో అత్యంత సంపన్న ఎమ్మెల్సీగా వాకాటి నారాయణ రెడ్డిగా తేల్చారు. ఆయన ఆస్తులు రూ.101 కోట్లుగా వెల్లడించారు. మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ మాధవరావు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీగా స్వతంత్ర ఎమ్మెల్సీ పి. రఘువర్మకు అతి తక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.1.84లక్షలు మాత్రమే ఆయన ఆస్తులుగా గుర్తించారు.
మొత్తం ఎమ్మెల్సీల్లో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. 40 మంది డిగ్రీ అంతకంటే ఎక్కువగా చదువుకుంటే.. ఎనిమిది మంది మాత్రం ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న వారిగా లెక్క తేలారు. ఏమైనా.. అత్యంత సంపన్నుడే కాదు.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీ ఏపీ మండలిలో ఉండటం కాస్తంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పొచ్చు.
This post was last modified on August 14, 2022 10:14 am
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…