Political News

ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడు లోకేశ్

ఏపీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తుల విషయంపై ఒక సంస్థ తాజాగా జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 58 మంది ఉండగా.. 48 మంది ఆస్తులకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయని.. మిగిలిన 10 మంది ఎమ్మెల్సీల వివరాలు తమకు అందలేదని చెబుతోందిన సదరు సంస్థ. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీల వివరాల్లో అధికార వైసీపీకి 22 మంది ఉంటే.. విపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు.

తాము సేకరించిన వివరాల్ని విశ్లేషించినప్పుడు.. మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులుగా గుర్తించినట్లు చెబుతోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ. దీనితో పాటు ఏపీ ఎలక్షన్ వాచ్ కూడా అధ్యయనాన్ని నిర్వహించింది. ఏపీ ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడిగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిలిచారు. ఆయన ఆస్తి రూ.369 కోట్లకు పైనేనని తేల్చారు.

మండలిలో రెండో అత్యంత సంపన్న ఎమ్మెల్సీగా వాకాటి నారాయణ రెడ్డిగా తేల్చారు. ఆయన ఆస్తులు రూ.101 కోట్లుగా వెల్లడించారు. మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ మాధవరావు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీగా స్వతంత్ర ఎమ్మెల్సీ పి. రఘువర్మకు అతి తక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.1.84లక్షలు మాత్రమే ఆయన ఆస్తులుగా గుర్తించారు.

మొత్తం ఎమ్మెల్సీల్లో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. 40 మంది డిగ్రీ అంతకంటే ఎక్కువగా చదువుకుంటే.. ఎనిమిది మంది మాత్రం ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న వారిగా లెక్క తేలారు. ఏమైనా.. అత్యంత సంపన్నుడే కాదు.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీ ఏపీ మండలిలో ఉండటం కాస్తంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పొచ్చు.

Satya

Recent Posts

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

42 minutes ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

47 minutes ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

56 minutes ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

60 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

1 hour ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

1 hour ago