అధికార పార్టీకి సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో గ్రూపుల గోలంతా బయటపడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకపోతే బహుశా టీఆర్ఎస్ లోని గ్రూపులు రోడ్డునపడేవి కావేమో. గ్రూపుల గోలను తట్టుకోలేక చివరకు కేసీయార్ కే ఏమిచేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. కేసీయార్ నిర్ణయించిన క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గంలోని చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నారు.
అభ్యర్ధి ఎంపిక విషయంలో తనను వ్యతిరేకిస్తున్న వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఇప్పుడు కేసీయార్ కే అర్ధం కావటంలేదు. ప్రభాకర్ కు టికెట్ ఇవ్వటాన్ని సుమారు 40 మంది ద్వితీయశ్రేణి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళంతా మామూలు కార్యకర్తలు కాదు. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న వారిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లు, కొందరు సర్పంచులున్నారు. నిజానికి అభ్యర్ధి ఎవరనే దాంతో సంబంధం లేకుండా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ద్వితీయ స్థాయి నేతలపైనే ఎక్కువగా ఉంటుంది.
అలాంటి నేతలే స్వయంగా కేసీయార్ చెప్పినా వినకపోతే రేపు పార్టీ ఎలా గెలుస్తుందనేది పెద్ద ప్రశ్న. ముందు మంత్రి జగదీశ్వరరెడ్డి చెప్పినా వినకపోతే మంత్రే కేసీయార్ దగ్గరకు వీళ్ళని తీసుకెళ్ళారు. అక్కడ సీఎం చెప్పినా వినలేదు. చివరకు ఎవరిని అభ్యర్ధిగా ఎంపిక చేసినా పార్టీ గెలుపుకు పనిచేయాల్సిందే అని చెప్పి కేసీయార్ భేటీని ముగించారు. అయితే శుక్రవారం ఉదయం వీళ్ళంతా చౌటుప్పల్లో మీటింగ్ పెట్టుకుని కూసుకుంట్లను వ్యతిరేకిస్తు తీర్మానం చేసి దాన్ని కేసీయార్ కు పంపారు.
తాను ఫైనల్ చేసిన అభ్యర్ధిని కూడా నేతలు ఇంతలా వ్యతిరేకిస్తారని కేసీయార్ ఊహించుండరు. అందుకనే అభ్యర్ధి ఎంపికను తనిష్టం వచ్చినట్లు చేశారు. అయితే ఆ విషయం నేతలతో సమావేశం జరిపినపుడు చెబితే సరిపోతుందని అనుకున్నారు. కానీ ముందుగానే అందరుకలిసి తన నిర్ణయాన్ని వ్యతిరేకించబోతున్నట్లు కేసీయార్ కు అసలు సమాచారమే లేదు. దాంతో అభ్యర్ధి విషయంలో ఇపుడేం చేయాలో కేసీయార్ కు తోచటంలేదు. పార్టీలో జరుగుతున్న గొడవలు చూసిన తర్వాత టీఆర్ఎస్ గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on August 13, 2022 2:00 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…