Political News

మరో పాదయాత్రకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్న డిమాండ్ తో కొంతకాలం క్రితం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తిరుపతి అలిపిరి వరకు పాదయాత్ర చేయటం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అంటూ మరో మహా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 12 నుంచి తాజా పాదయాత్ర షురూ కానుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఆందోళన మొదలు పెట్టి సెప్టెంబరు 12 నాటికి వెయ్యి రోజులు పూర్తి కానున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి పాదయాత్ర చేపట్టడం ద్వారా తమ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలన్న డిమాండ్ తో 44 రోజుల పాటు తొలి మహాపాదయాత్రను నిర్వహించి.. తిరుపతిలోని అలిపిరి వద్ద పాదయాత్రను ముగించి.. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు నిర్వహించిన మొదటి పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనటం.. ఆ సందర్భంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.

నిత్య నరకాన్ని భరిస్తూ.. తమ డిమాండ్ల విషయంలో జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ వారు పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి పాదాల చెంత ముగిసిన పాదయాత్ర తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి షురూ కానుంది. ఈ దఫా కూడా పాదయాత్రలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లోని మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా అమరావతి నుంచి పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయించిన విశాఖ మీదుగా అరసవెల్లికి వెళ్లనుంది.

అమరావతి రైతులు ప్రకటించిన ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 30 వేల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానితోనే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలన్న నినాదంతో మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. తాజా పాదయాత్రతో మరోసారి రచ్చ తప్పదన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on August 13, 2022 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

3 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

5 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

6 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

7 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

8 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

9 hours ago