Political News

మరో పాదయాత్రకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్న డిమాండ్ తో కొంతకాలం క్రితం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తిరుపతి అలిపిరి వరకు పాదయాత్ర చేయటం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అంటూ మరో మహా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 12 నుంచి తాజా పాదయాత్ర షురూ కానుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఆందోళన మొదలు పెట్టి సెప్టెంబరు 12 నాటికి వెయ్యి రోజులు పూర్తి కానున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి పాదయాత్ర చేపట్టడం ద్వారా తమ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలన్న డిమాండ్ తో 44 రోజుల పాటు తొలి మహాపాదయాత్రను నిర్వహించి.. తిరుపతిలోని అలిపిరి వద్ద పాదయాత్రను ముగించి.. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు నిర్వహించిన మొదటి పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనటం.. ఆ సందర్భంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.

నిత్య నరకాన్ని భరిస్తూ.. తమ డిమాండ్ల విషయంలో జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ వారు పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి పాదాల చెంత ముగిసిన పాదయాత్ర తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి షురూ కానుంది. ఈ దఫా కూడా పాదయాత్రలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లోని మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా అమరావతి నుంచి పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయించిన విశాఖ మీదుగా అరసవెల్లికి వెళ్లనుంది.

అమరావతి రైతులు ప్రకటించిన ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 30 వేల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానితోనే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలన్న నినాదంతో మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. తాజా పాదయాత్రతో మరోసారి రచ్చ తప్పదన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on August 13, 2022 2:02 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

22 mins ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

26 mins ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

1 hour ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

2 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

3 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

3 hours ago