Political News

మరో పాదయాత్రకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్న డిమాండ్ తో కొంతకాలం క్రితం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తిరుపతి అలిపిరి వరకు పాదయాత్ర చేయటం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అంటూ మరో మహా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 12 నుంచి తాజా పాదయాత్ర షురూ కానుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఆందోళన మొదలు పెట్టి సెప్టెంబరు 12 నాటికి వెయ్యి రోజులు పూర్తి కానున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి పాదయాత్ర చేపట్టడం ద్వారా తమ డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలన్న డిమాండ్ తో 44 రోజుల పాటు తొలి మహాపాదయాత్రను నిర్వహించి.. తిరుపతిలోని అలిపిరి వద్ద పాదయాత్రను ముగించి.. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు నిర్వహించిన మొదటి పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనటం.. ఆ సందర్భంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.

నిత్య నరకాన్ని భరిస్తూ.. తమ డిమాండ్ల విషయంలో జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ వారు పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి పాదాల చెంత ముగిసిన పాదయాత్ర తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి షురూ కానుంది. ఈ దఫా కూడా పాదయాత్రలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లోని మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా అమరావతి నుంచి పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయించిన విశాఖ మీదుగా అరసవెల్లికి వెళ్లనుంది.

అమరావతి రైతులు ప్రకటించిన ఈ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 30 వేల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానితోనే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలన్న నినాదంతో మహా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. తాజా పాదయాత్రతో మరోసారి రచ్చ తప్పదన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on August 13, 2022 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం…

6 hours ago

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…

7 hours ago

క‌న్నీళ్ల‌తో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్త‌రాది అమ్మాయి పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయ‌ల్…

9 hours ago

చిరంజీవిని వాడుతున్న జెట్లీ సింహం

ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…

10 hours ago

దురంధర్ కాంబో రిపీట్ కానుందా

ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…

10 hours ago

వంద బరువులు మోస్తున్న నాగార్జున

అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…

12 hours ago