రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి. విషాదకరమైన విషయం ఏమంటే.. తన తమ్ముడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. తన తండ్రి హత్యకు సంబంధించిన తమకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని.. సీబీఐను ప్రతివాదులుగా చేసిన వైనం సంచలనంగా మారింది. తన తండ్రి హత్య కేసు విచారణలో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని.. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నట్లుగా ఆమెపిటిషన్ ను పేర్కొనటం గమనార్హం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి స్వయంగా సోదరుడైన వ్యక్తి అత్యంత దారుణంగా ఆయన ఇంట్లోనే హత్యకు గురి కావటం..
అది హత్యగా కాకుండా సహజ మరణంగా చూపించేందుకుప్రయత్నాలు జరగటం.. ఈ ఉదంతంలో ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్న వేళ.. సీబీఐ విచారణ నెమ్మదిగా సాగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నింటికి మించి.. తన బాబాయ్ అంటే తనకెంతో ప్రేమ అని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..తన బాబాయ్ హత్యకు కారణమైన నిందితులకు వెంటనే శిక్ష పడేలా ఒత్తిడి.. చేయాల్సిన రీతిలో చేయటం లేదన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
వివేకా సొంత అన్న కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మీద రావటం విస్మయానికి గురి చేస్తోంది. తన అక్క సుప్రీంకోర్టును ఆశ్రయించి.. పిటిషన్ దాఖలు చేసిన వేళ.. ఇప్పటికైనా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి. మరి.. ఇప్పటికైనా ఈ అంశంపై వైఎస్ జగన్ మరింత సీరియస్ గా ఫోకస్ చేస్తే బాగుంటుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 12, 2022 6:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…