రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి. విషాదకరమైన విషయం ఏమంటే.. తన తమ్ముడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. తన తండ్రి హత్యకు సంబంధించిన తమకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని.. సీబీఐను ప్రతివాదులుగా చేసిన వైనం సంచలనంగా మారింది. తన తండ్రి హత్య కేసు విచారణలో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని.. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నట్లుగా ఆమెపిటిషన్ ను పేర్కొనటం గమనార్హం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి స్వయంగా సోదరుడైన వ్యక్తి అత్యంత దారుణంగా ఆయన ఇంట్లోనే హత్యకు గురి కావటం..
అది హత్యగా కాకుండా సహజ మరణంగా చూపించేందుకుప్రయత్నాలు జరగటం.. ఈ ఉదంతంలో ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్న వేళ.. సీబీఐ విచారణ నెమ్మదిగా సాగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నింటికి మించి.. తన బాబాయ్ అంటే తనకెంతో ప్రేమ అని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..తన బాబాయ్ హత్యకు కారణమైన నిందితులకు వెంటనే శిక్ష పడేలా ఒత్తిడి.. చేయాల్సిన రీతిలో చేయటం లేదన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
వివేకా సొంత అన్న కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మీద రావటం విస్మయానికి గురి చేస్తోంది. తన అక్క సుప్రీంకోర్టును ఆశ్రయించి.. పిటిషన్ దాఖలు చేసిన వేళ.. ఇప్పటికైనా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి. మరి.. ఇప్పటికైనా ఈ అంశంపై వైఎస్ జగన్ మరింత సీరియస్ గా ఫోకస్ చేస్తే బాగుంటుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…