ఈమధ్యనే కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ కు భారీ నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు. ప్రాజెక్టులో నుండి నీటిని తోడి పంపటానికి వీలుగా ఏర్పాటుచేసిన పంప్ హౌస్ లోని 17 మోటాటర్లలో ఎనిమిది మోటార్లు దెబ్బతిన్నట్లు నిపుణులు స్పష్టంగా తేల్చారు. ఇందులో కూడా ఆరుమోటార్లను పూర్తిగా మార్చాల్సిందే అని అభిప్రాయపడ్డారు. మరో రెండు మోటార్లు కూడా దెబ్బతిన్నప్పటికీ రిపేర్లు చేయిస్తే బాగుపడతాయని అంచనా వేస్తున్నారు.
మిగిలిన తొమ్మిది మోటార్లకు పెద్ద నష్టం జరగలేదని సమాచారం. దెబ్బతిన్న ఆరుమోటార్ల కారణంగా సుమారు వెయ్యి కోట్లరూపాయల నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు. మోటార్లను పూర్తిగా పరిశీలించి రిపేర్లు లేదా కొత్తవి అమర్చటం అనే నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఫిన్లాండ్, ఆస్ట్రియా నుండి నిపుణులను పిలిపిస్తోంది. జైంట్ సైజ్ మోటార్లను రిపేర్లుచేసేంత సామర్ధ్యం మనదగ్గర ఇంజనీర్లకు లేదట.
మరి పై రెండుదేశాల నుండి ఇంజనీర్లు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పరిశీలించి తన అభిప్రాయాలు చెబుతారో చూడాల్సిందే. ఇప్పటికైతే మన నిపుణుల అంచనా ప్రకారం వెయ్యికోట్ల రూపాయల నష్టమైతే ఖాయమైంది. భారీవర్షాలు, వరద తగ్గి చాలా రోజులే అయినా బురద పేరుకుపోవటంతో ఇంతకాలం నిపుణులు ఎలాంటి అంచనాలు వేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే పంపుహౌస్ లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. దాదాపు 500 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, మామూలు లేబర్ బురద, శకలాలు తొలగించేపనిలోనే పనిచేస్తున్నారు.
వరదదెబ్బకు పంప్ హౌస్ రూపురేఖలే మారిపోయాయి. పంప్ హౌస్ అంతా చెడిపోయిన మోటార్లు, పడిపోయిన రక్షణగోడలు, విరిగిపోయిన క్రేన్లు, తెగిపోయిన కేబుళ్ళు, చిందరవందరగా చెల్లాచెదురైన సామగ్రితో పంప్ హౌస్ భయంకరంగా ఉంది. వీటన్నింటినీ ఇపుడు నిపుణులు, పనివాళ్ళు ఒక్కక్కటే సరిచేస్తున్నారు. మొత్తంమీద మోటార్లకు వెయ్యికోట్ల రూపాయల నష్టమంటే మామూలు విషయంకాదు.
This post was last modified on August 12, 2022 5:54 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…