Political News

వచ్చే ఎన్నికల్లో తేజస్వీయే ఛాంపియనా ?

బీహార్లో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి దెబ్బ తప్పేట్లు లేదు. ఇండియా టు డే-సీ ఓటర్ ఇదే అంశంపై రాష్ట్రంలో సర్వే చేసిందట. దాని ఫలితాలను బుధవారం విడుదల చేసింది. తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే మొత్తం 40 స్ధానాల్లో మహాఘట్ బంధన్ 26 స్ధానాల్లో గెలుస్తుందని ఇండియు టు డే స్నాప్ పోల్ తేల్చింది. సర్వేలన్నీ నిజాలవుతాయని అనుకునేందుకు లేదు. కాకపోతె పబ్లిక్ పల్స్ ఎలాగుందనే విషయంలో కేస్ స్టడీగా తీసుకోవచ్చు

బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేకి 14 సీట్లు మాత్రమే దక్కుతాయని చెప్పింది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 39 సీట్లు వస్తే మహాఘట్ బంధన్ కు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఇదే సమయంలో ఎన్డీయే ఓటింగ్ శాతం 54 నుండి 41కి తగ్గిపోతుందని సర్వేలో తేలింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రజాధరణ కోల్పోతున్నట్లు బయటపడింది.

నితీష్ కాకపోతే తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయమై జరిగిన సర్వేలో ఎక్కువమంది ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ వైపే మొగ్గు చూపడం గమనార్హం.  43 శాతం మంది తేజస్వీని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్-తేజస్విల్లో ఎవరిని ముఖ్యమంత్రులుగా ఎంచుకుంటారన్న ప్రశ్నకు నితీష్ వైపు 24 శాతం మందే మొగ్గుచూపారు. 19 శాతం మంది బీజేపీ నేత సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అంటే ఇండియా టు డే స్నాప్ పోల్ సర్వేని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే బీహార్ కు వచ్చే ఎన్నికల్లో కావచ్చు లేదా తర్వాతైనా కావచ్చు తేజస్వీ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని. తేజస్వికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మిగిలిన జనాల్లో కూడా తేజస్వికి మద్దతు పెరుగుతోందన్న విషయం అర్ధమవుతోంది. ఇపుడు డిప్యుటి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తేజస్వి మిగిలిన కాలాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే వచ్చే ఎన్నికల్లోనే హీరో అయినా ఆశ్చర్యం లేదు. 

This post was last modified on August 11, 2022 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి షోలు…100 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

4 minutes ago

AI వాడి కరెంట్ బిల్లు తగ్గిస్తారా?

పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…

27 minutes ago

‘అఖండ’మైన నిర్ణయం తీసుకునే టైమొచ్చింది

అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…

50 minutes ago

ఇండిగో: టికెట్ డబ్బులిస్తే సరిపోతుందా?

దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…

1 hour ago

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

3 hours ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

4 hours ago