ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ రెండు ఖాళీల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవరికి కొత్త మంత్రులుగా అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడాది పాలనతో దూసుకెళుతున్న జగన్ సర్కారు.. మహమ్మారి లాంటి విపత్తు వేళలోనూ.. తనదైన శైలిలో పాలనపై ముద్ర వేస్తున్నారు.
మహమ్మారికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోజగన్ ప్రభుత్వం అనుసరించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసుల వ్యాప్తిని నిరోధించటంలో ఏపీ సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి పదవుల్ని దక్కించుకోవటం కోసం పోటీ పెరుగుతోంది. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో.. అదే వర్గానికి చెందిన నేతలకే పదవులు లభిస్తాయన్న ప్రచారం సాగుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటివరకూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిందరి పేర్లు పెద్ద ఆశ్చర్యానికి గురి చేయకున్నా.. సీనియర్ నేత.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు తెర మీదకు రావటం అనూహ్యంగా చెబుతున్నారు. బీసీ కోటాలోకి కాపు సామాజిక వర్గాన్ని తాను పరిగణలోకి తీసుకుంటున్న సందేశాన్ని ఉమ్మారెడ్డి నియామకంతో జగన్ స్పష్టం చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే వీలుంది.
ఇదిలా ఉంటే.. కొత్త మంత్రుల చేత పదవీ ప్రమాణస్వీకారం చేయించటానికి ముహుర్తాన్ని ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆషాడ మాసం నడుస్తున్న వేళ.. శ్రావణమాసంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 20తో ఆషాడం ముగుస్తుందని.. 21 శ్రావణం ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి.. ఈసారికి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on July 3, 2020 4:28 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…