Political News

అక్కడ మాత్రం మోడీకి ఇబ్బందులు తప్పవా?

నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయే ఎన్డీయేలో నుండి బయటకు వెళ్ళిపోవటంతో నరేంద్రమోడీకి ఒక్కసారిగా ఇబ్బుందులు మొదలైపోయాయి. లోక్ సభలో బీజేపీ లేదా ఎన్డీయేకి సంపూర్ణ మెజారిటి ఉన్నా రాజ్యసభలో మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. బిల్లులు గట్టెక్కటానికి ఎన్డీయే పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. జేడీయూ ఉన్నపుడే నూరుశాతం మెజారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు నితీష్ ఎన్డీయేకి కటీఫ్ చెప్పేసిన తర్వాత ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయింది.

245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నది 237 మంది మాత్రమే. ఇపుడున్న ఎంపీల సంఖ్యను తీసుకుంటే బిల్లు పాస్ కావాలంటే మ్యాజిక్ మార్క్ 119. ఇపుడు జేడీయు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్డీయే బలం 110కి పడిపోయింది. అంటే మరో తొమ్మిది మంది ఎంపీల మద్దతుంటే కానీ ఏ బిల్లునూ ఎన్డీయే పాస్ చేయించుకోలేదు. మరపుడు ఏమిచేయాలి ? నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలపైన ఆధారపడక తప్పదు. అంటే బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నమాట.

ఈ నేపధ్యంలోనే  జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత పెరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఇపుడు అవసరానికి ఎన్డీయేకి జగన్ మద్దతిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రానికి జగన్ మద్దతిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోవటంలేదు. ఇపుడు మారిన పరిస్దితుల్లో ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా పట్టుబడితే రాజ్యసభలో మద్దతును దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ఏమైనా సానుకూలమయ్యే అవకాశముంది.

ఏదేమైనా ఎన్డీయేలో  లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. రాష్ట్రాలను కూడా బీజేపీ కబళించేస్తోంది. అయినా రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ ఎన్డీయేకి అందని ద్రాక్ష పండు లాగా తయారవుతోంది. నాలుగు రోజులు మెజారిటి ఉందని అనుకోగానే వెంటనే మైనారిటీలోకి పడిపోతోంది. కాకపోతే మోడీ అదృష్టం ఏమిటంటే యూపీఏ పరిస్ధితి ఇంతకన్నా ఘోరంగా ఉందికాబట్టే  ఏదోలా తటస్థుల మద్దతుతో బిల్లులను ఎన్డీయే గట్టెక్కించగలుగుతోంది. 

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago