Modi
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయే ఎన్డీయేలో నుండి బయటకు వెళ్ళిపోవటంతో నరేంద్రమోడీకి ఒక్కసారిగా ఇబ్బుందులు మొదలైపోయాయి. లోక్ సభలో బీజేపీ లేదా ఎన్డీయేకి సంపూర్ణ మెజారిటి ఉన్నా రాజ్యసభలో మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. బిల్లులు గట్టెక్కటానికి ఎన్డీయే పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. జేడీయూ ఉన్నపుడే నూరుశాతం మెజారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు నితీష్ ఎన్డీయేకి కటీఫ్ చెప్పేసిన తర్వాత ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయింది.
245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నది 237 మంది మాత్రమే. ఇపుడున్న ఎంపీల సంఖ్యను తీసుకుంటే బిల్లు పాస్ కావాలంటే మ్యాజిక్ మార్క్ 119. ఇపుడు జేడీయు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్డీయే బలం 110కి పడిపోయింది. అంటే మరో తొమ్మిది మంది ఎంపీల మద్దతుంటే కానీ ఏ బిల్లునూ ఎన్డీయే పాస్ చేయించుకోలేదు. మరపుడు ఏమిచేయాలి ? నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలపైన ఆధారపడక తప్పదు. అంటే బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నమాట.
ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత పెరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఇపుడు అవసరానికి ఎన్డీయేకి జగన్ మద్దతిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రానికి జగన్ మద్దతిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోవటంలేదు. ఇపుడు మారిన పరిస్దితుల్లో ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా పట్టుబడితే రాజ్యసభలో మద్దతును దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ఏమైనా సానుకూలమయ్యే అవకాశముంది.
ఏదేమైనా ఎన్డీయేలో లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. రాష్ట్రాలను కూడా బీజేపీ కబళించేస్తోంది. అయినా రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ ఎన్డీయేకి అందని ద్రాక్ష పండు లాగా తయారవుతోంది. నాలుగు రోజులు మెజారిటి ఉందని అనుకోగానే వెంటనే మైనారిటీలోకి పడిపోతోంది. కాకపోతే మోడీ అదృష్టం ఏమిటంటే యూపీఏ పరిస్ధితి ఇంతకన్నా ఘోరంగా ఉందికాబట్టే ఏదోలా తటస్థుల మద్దతుతో బిల్లులను ఎన్డీయే గట్టెక్కించగలుగుతోంది.
This post was last modified on August 11, 2022 2:11 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…