మహారాష్ట్రలోని శివసేన నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. సరే ఆ లెక్క బీహార్లో సరిపోయింది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీ బీహార్లో అధికార పార్టీ హోదా నుంచి ప్రతిపక్షంలోకి వచ్చేసింది. వచ్చే డిసెంబర్లో బెంగాల్లోని మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేయబోతున్నట్లు బీజేపీ హెచ్చరించింది.
బెంగాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్లో మమత ప్రభుత్వం కూలిపోతుందన్నారు. అంతేకాకుండా 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలతో పాటే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగా బీజేపీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
పోయిన సంవత్సరంలో జరిగిన బెంగాల్లో ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసలా ఎన్నికలకు ముందే మమత ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. టీఎంసీకి చెందిన 30 మంది ఎంఎల్ఏలను లాగేసుకుంది. అయితే అంతకు మించి ఎంఎల్ఏలు బీజేపీలో చేరకపోవటంతో మమత ప్రభుత్వం ఎన్నికల వరకు కంటిన్యూ అవ్వగలిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలే రాబట్టినా మమత మాత్రం అఖండ మెజారిటితో మళ్ళీ అధికారంలోకి రావటం బీజేపీకి మింగుడు పడలేదు.
అప్పటి నుండి ఏదో పద్ధతిలో తృణమూల్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నది బీజేపీ. రాష్ట్రంలో తృణమూల్ ప్రభుత్వాన్ని తీసేయటానికి వేదిక రెడీ చేస్తున్నట్లు సువేందు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సువేందు చెప్పినందుకు ఆయనపై కేసు నమోదు చేయచ్చు. బెంగాల్లో లాగానే ఝార్ఖండ్, రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టేస్తామంటు సువేందు గతంలో కూడా హెచ్చరించారు. అంటే ఏదో పద్దతిలో దేశమంతా తాను మాత్రమే అధికారంలో ఉండాలనేది బీజేపీ ఆలోచనగా అర్ధమవుతోంది. మరీ విపరీత పోకడలను జనాలు ఎలా తట్టుకుంటారో చూడాలి.
This post was last modified on August 11, 2022 12:40 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…