Political News

కేసీయార్ నిర్ణయం.. షాక్ ఇస్తున్న నేతలు

పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించటం ద్వారా మునుగోడు నేతలు ఏకంగా కేసీయార్ కే షాకిచ్చారు. మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఉపఎన్నికలో పోటీచేయించాలని కేసీయార్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చెప్పి నేతలందరినీ ఒప్పించమని బాధ్యత అప్పగించారు. అయితే నేతలంతా కలిసి మంత్రితో పాటు కేసీయార్ కు కూడా పెద్ద షాకిచ్చారు.

కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మంత్రితో తెగేసి చెప్పారు. ఇదే విషయాన్ని తాము ఇంతకుముందు కేసీయార్ కు నేరుగా లేఖ రాసినట్లు నేతలు చెబుతున్నారు. బుధవారం ఉదయం నుంచి నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటి ఛైర్మన్లు సుమారు 30 మందితో మంత్రి భేటీలు జరిపారు. మంత్రి ఎంత చెప్పినా నేతలు అంగీకరించలేదు. దాంతో విషయాన్ని మంత్రి కేసీయార్ దృష్టికే తీసుకెళ్ళారు.

నేతలు ఇంతగా వ్యతిరేకిస్తున్న కూసుకుంట్లకే టికెట్ ఇవ్వాలని కేసీయార్+మంత్రి ఎందుకు పట్టుబడుతున్నారో అర్ధం కావటం లేదు. ఇంతమంది నేతలు వ్యతిరేకిస్తున్న వ్యక్తిని కేసీయార్ అభ్యర్ధిగా వద్దని అంటున్నారు. వ్యవహారం చూస్తుంటే కేసీయార్ చెప్పినా పై 30 మంది నేతలు అంగీకరించేట్లు లేరు. ఒకవేళ కేసీయార్ తో ముఖాముఖి సమావేశంలో ఏమీ చెప్పలేకపోయినా మనస్పూర్తిగా గెలుపుకు పనిచేస్తారని గ్యారెంటీ అయితే లేదు. ఈ విషయాలు కేసీయార్ కు తెలిసినా పదే పదే కూసుకుంట్ల విషయంలో పట్టుబడుతున్నారు.

ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని కాబట్టి అందరు కేసీయార్ ఎంపిక చేసిన అభ్యర్ధి కోసం కష్టపడాలని మంత్రి పదేపదే నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఎవరికివ్వాలనేది కేసీయార్ ఇష్టమని ఉపఎన్నికలో గెలుపు తర్వాత కష్టపడిన నేతలందరికీ మంచి గుర్తింపు ఉంటుందని బిస్కెట్ వేస్తున్నా నేతలెవరూ ఒప్పుకోవటం లేదు. అభ్యర్ధి విషయంలో నియోజకవర్గంలోని 30 మంది నేతలు తనకు ఎదురు తిరుగుతారని కేసీయార్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో ఇపుడేంచేయాలో సీఎంకు అర్ధం కావటం లేదు. 

This post was last modified on August 11, 2022 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago