పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించటం ద్వారా మునుగోడు నేతలు ఏకంగా కేసీయార్ కే షాకిచ్చారు. మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఉపఎన్నికలో పోటీచేయించాలని కేసీయార్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చెప్పి నేతలందరినీ ఒప్పించమని బాధ్యత అప్పగించారు. అయితే నేతలంతా కలిసి మంత్రితో పాటు కేసీయార్ కు కూడా పెద్ద షాకిచ్చారు.
కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మంత్రితో తెగేసి చెప్పారు. ఇదే విషయాన్ని తాము ఇంతకుముందు కేసీయార్ కు నేరుగా లేఖ రాసినట్లు నేతలు చెబుతున్నారు. బుధవారం ఉదయం నుంచి నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటి ఛైర్మన్లు సుమారు 30 మందితో మంత్రి భేటీలు జరిపారు. మంత్రి ఎంత చెప్పినా నేతలు అంగీకరించలేదు. దాంతో విషయాన్ని మంత్రి కేసీయార్ దృష్టికే తీసుకెళ్ళారు.
నేతలు ఇంతగా వ్యతిరేకిస్తున్న కూసుకుంట్లకే టికెట్ ఇవ్వాలని కేసీయార్+మంత్రి ఎందుకు పట్టుబడుతున్నారో అర్ధం కావటం లేదు. ఇంతమంది నేతలు వ్యతిరేకిస్తున్న వ్యక్తిని కేసీయార్ అభ్యర్ధిగా వద్దని అంటున్నారు. వ్యవహారం చూస్తుంటే కేసీయార్ చెప్పినా పై 30 మంది నేతలు అంగీకరించేట్లు లేరు. ఒకవేళ కేసీయార్ తో ముఖాముఖి సమావేశంలో ఏమీ చెప్పలేకపోయినా మనస్పూర్తిగా గెలుపుకు పనిచేస్తారని గ్యారెంటీ అయితే లేదు. ఈ విషయాలు కేసీయార్ కు తెలిసినా పదే పదే కూసుకుంట్ల విషయంలో పట్టుబడుతున్నారు.
ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని కాబట్టి అందరు కేసీయార్ ఎంపిక చేసిన అభ్యర్ధి కోసం కష్టపడాలని మంత్రి పదేపదే నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఎవరికివ్వాలనేది కేసీయార్ ఇష్టమని ఉపఎన్నికలో గెలుపు తర్వాత కష్టపడిన నేతలందరికీ మంచి గుర్తింపు ఉంటుందని బిస్కెట్ వేస్తున్నా నేతలెవరూ ఒప్పుకోవటం లేదు. అభ్యర్ధి విషయంలో నియోజకవర్గంలోని 30 మంది నేతలు తనకు ఎదురు తిరుగుతారని కేసీయార్ ఏమాత్రం ఊహించలేదు. దీంతో ఇపుడేంచేయాలో సీఎంకు అర్ధం కావటం లేదు.
This post was last modified on August 11, 2022 12:00 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…