రాష్ట్రమంతా తెలిసిన పేరు అని చెప్పలేం కానీ.. ఉమ్మడి గుంటూరు.. క్రిష్ణా జిల్లాల్లో సుపరిచిత నేతగా అందరికి తెలుసు గంజి చిరంజీవి. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వైనం షాకింగ్ గా మారింది. దీంతో గుంటూరు జిల్లాలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఈ నేత.. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు అని చెబుతూ.. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
బీసీగా ఉన్న తనను పార్టీలో ఇబ్బంది పెట్టారని.. రాజకీయంగా తనను తొక్కేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అతను ఓటమిపాలయ్యారు. దీనికి కారణం పార్టీలోని సొంతనేతలే అంటూ ఆరోపించిన అతను.. పదవుల కోసం.. పరపతి కోసం తాను పార్టీకి రాజీనామా చేయటం లేదన్నారు. 2019లో మంగళగిరి సీటు చిరంజీవిదేనని చెప్పినా.. లోకేశ్ రంగంలోకి దిగటం.. ఆయనే స్వయంగా పోటీ చేయటంతో ఆయనకు అవకాశం లభించలేదు.
వచ్చే దఫా కూడా మంగళగిరి నుంచే లోకేశ్ పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేయటం.. ఆయనకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవటంతో పార్టీ నుంచి బయటకు రావటానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చిరంజీవి.. ఏ పార్టీలో చేరాలన్నది తాను నిర్ణయించుకోలేదన్నారు. రాజీనామా చేసిన సందర్భంలో అతగాడి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారే వీలుందని చెబుతున్నారు.
సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే తాను పార్టీకి గుడ్ బై చెప్పినట్లు పేర్కొనటం గమనార్హం. ‘చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాదే అని చెప్పి మోసం చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి మంగళగిరి ప్రజలకు నన్ను దూరం చేశారు. చేనేత వర్గానికి చెందిన నన్ను అణగదొక్కారు. నా ఆవేదన.. బాధ నాయకులకు తెలిసినా నన్ను పట్టించుకోలేదు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీలకు న్యాయం చేసే వారితో నడుస్తా’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గంజి చిరంజీవి రాజీనామాకు లోకేశ్ కారణంగా భావిస్తున్నారు.
This post was last modified on August 10, 2022 6:05 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…