ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదురొడ్డేంత సాహసం దేశంలోని పవర్ ఫుల్ ముఖ్యమంత్రులకు లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక సీఎం ప్రధాని మోడీకి షాకిస్తూ తన పదవికి రాజీనామా చేసి.. తర్వాతి రోజే ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అందరి అంచనాలకు తగ్గట్లే.. బిహార్ ముఖ్యమంత్రిగా ఈ రోజు (బుధవారం)మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
సినిమాటిక్ ట్విస్టులు ఏమీ లేకుండా తన రాజకీయ జీవితంలో ఎనిమిదో సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం విశేషం. తన కొత్త మిత్రుడు ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఆయన తన కేబినెట్ లో కొలువు తీరారు. తాజా కూటమిలో కీలకమైన ఆర్జేడీ పార్టీకి చెందిన కీలక నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత బిహార్ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. ఆయన సతీమణి.. తేజస్వీ తల్లి.. సోదరుడు తేజ్ ప్రతాప్ లు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారానికి ముందు నీతీశ్ కుమార్ తో లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాల్ని మాట్లాడుకున్న ఈ ఇద్దరు.. నీతీశ్ నిర్ణయాన్ని బలపర్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆయన్ను అభినందించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీలకమైన స్పీకర్ పదవిని ఆర్జేడీకి చెందిన నేతకు అప్పగించేందుకు నీతీశ్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.
మరో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ కు నాలుగు మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం (2015లో) ఇదే కాంబినేషన్లో (జేడీయూ -ఆర్జేడీ- కాంగ్రెస్) బిహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. అప్పట్లోనూ సీఎంగా నీతీశ్.. లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా.. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రి పదవులు అప్పజెప్పారు. తాజా ప్రభుత్వంలోనూ అతగాడికి మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి మోడీషాల ఎత్తులకు భిన్నంగా నీతీశ్ పావులు కదిపి.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు.
This post was last modified on August 10, 2022 4:48 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…