Political News

నీతీశ్ రాజీనామా దెబ్బ.. తర్వాతి రోజే సీఎంగా..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదురొడ్డేంత సాహసం దేశంలోని పవర్ ఫుల్ ముఖ్యమంత్రులకు లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక సీఎం ప్రధాని మోడీకి షాకిస్తూ తన పదవికి రాజీనామా చేసి.. తర్వాతి రోజే ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అందరి అంచనాలకు తగ్గట్లే.. బిహార్ ముఖ్యమంత్రిగా ఈ రోజు (బుధవారం)మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.

సినిమాటిక్ ట్విస్టులు ఏమీ లేకుండా తన రాజకీయ జీవితంలో ఎనిమిదో సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం విశేషం. తన కొత్త మిత్రుడు ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఆయన తన కేబినెట్ లో కొలువు తీరారు. తాజా కూటమిలో కీలకమైన ఆర్జేడీ పార్టీకి చెందిన కీలక నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత బిహార్ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. ఆయన సతీమణి.. తేజస్వీ తల్లి.. సోదరుడు తేజ్ ప్రతాప్ లు హాజరయ్యారు.

ప్రమాణస్వీకారానికి ముందు నీతీశ్ కుమార్ తో లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాల్ని మాట్లాడుకున్న ఈ ఇద్దరు.. నీతీశ్ నిర్ణయాన్ని బలపర్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆయన్ను అభినందించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీలకమైన స్పీకర్ పదవిని ఆర్జేడీకి చెందిన నేతకు అప్పగించేందుకు నీతీశ్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.

మరో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ కు నాలుగు మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం (2015లో) ఇదే కాంబినేషన్లో (జేడీయూ -ఆర్జేడీ- కాంగ్రెస్) బిహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. అప్పట్లోనూ సీఎంగా నీతీశ్.. లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా.. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రి పదవులు అప్పజెప్పారు. తాజా ప్రభుత్వంలోనూ అతగాడికి మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి మోడీషాల ఎత్తులకు భిన్నంగా నీతీశ్ పావులు కదిపి.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు.

This post was last modified on August 10, 2022 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

27 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago