ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదురొడ్డేంత సాహసం దేశంలోని పవర్ ఫుల్ ముఖ్యమంత్రులకు లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక సీఎం ప్రధాని మోడీకి షాకిస్తూ తన పదవికి రాజీనామా చేసి.. తర్వాతి రోజే ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. అందరి అంచనాలకు తగ్గట్లే.. బిహార్ ముఖ్యమంత్రిగా ఈ రోజు (బుధవారం)మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
సినిమాటిక్ ట్విస్టులు ఏమీ లేకుండా తన రాజకీయ జీవితంలో ఎనిమిదో సారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం విశేషం. తన కొత్త మిత్రుడు ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఆయన తన కేబినెట్ లో కొలువు తీరారు. తాజా కూటమిలో కీలకమైన ఆర్జేడీ పార్టీకి చెందిన కీలక నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరి చేత బిహార్ రాష్ట్ర గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. ఆయన సతీమణి.. తేజస్వీ తల్లి.. సోదరుడు తేజ్ ప్రతాప్ లు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారానికి ముందు నీతీశ్ కుమార్ తో లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాల్ని మాట్లాడుకున్న ఈ ఇద్దరు.. నీతీశ్ నిర్ణయాన్ని బలపర్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఆయన్ను అభినందించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీలకమైన స్పీకర్ పదవిని ఆర్జేడీకి చెందిన నేతకు అప్పగించేందుకు నీతీశ్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.
మరో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ కు నాలుగు మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం (2015లో) ఇదే కాంబినేషన్లో (జేడీయూ -ఆర్జేడీ- కాంగ్రెస్) బిహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. అప్పట్లోనూ సీఎంగా నీతీశ్.. లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా.. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రి పదవులు అప్పజెప్పారు. తాజా ప్రభుత్వంలోనూ అతగాడికి మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి మోడీషాల ఎత్తులకు భిన్నంగా నీతీశ్ పావులు కదిపి.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటంలో విజయం సాధించారని చెప్పక తప్పదు.
This post was last modified on August 10, 2022 4:48 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…