Political News

ఆ టాపిక్ పై బాబు ఫుల్ ఫోకస్

తెలుగుదేశం పార్టీలో యువతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వటంలో భాగంగా సమగ్ర అధ్యయనం చేయించాలని కూడా నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లిస్తామని చంద్రబాబు ఎన్నిసార్లు  ప్రకటించారో అందరు చూసిందే. మరిపుడు తాజా ప్రకటన ఏమిటో అర్ధం కావటం లేదు.

నిజానికి ఇపుడు పార్టీలో సీనియర్లుగా ఉన్నవారిలో అత్యధికులు పార్టీ పెట్టినప్పుడు 1983లో చేరినవారే. యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి అనేకమంది అప్పట్లో యువతగానే పార్టీలో చేరారు. అయితే కాలక్రమంలో పార్టీలో చేరిన వాళ్ళల్లో యువత శాతం తగ్గిపోయింది. అప్పట్లో యువతగా పార్టీలో చేరిన వారే ఇపుడూ కంటిన్యు అవుతున్నారు. దాంతో పార్టీలో యువత ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇపుడు యువతంటే సీనియర్ల వారసులు మాత్రమే  అన్నట్లుగా ముద్రపడిపోయింది.

సీనియర్ల వారసులను కాకుండా ఇతరత్రా యువతను పార్టీ ప్రోత్సహిస్తే మరింతగా యువత పార్టీలో చేరే అవకాశముంది. రాబోయే ఎన్నికల్లో 40 శాతం యువతకే ఎన్నికల్లో టికెట్లిస్తానని బహిరంగంగా ప్రకటించిన చంద్రబాబు ఇపుడు యువతపై సమగ్ర అధ్యయనం చేయించాలని డిసైడ్ చేయటం ఏమిటో అర్ధం కావటం లేదు. పార్టీ సభ్యత్వం వివరాలను చూస్తే యువత ఎవరు? ఎంతమంది యువత ఉన్నారనే విషయం వెంటనే తేలిపోతుంది. దీనికి పెద్ద అధ్యయనం అవసరమే లేదు.

మామూలుగా అయితే 19 నుంచి 35 మధ్య వయస్సులో ఉన్న వారిని యూత్ గా పిలుస్తుంటారు. మరీ వయసులోని వారు పార్టీలో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ముందుగా లెక్క తేల్చాలి. దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తే నిజంగానే యువతను ప్రోత్సహించినట్లవుతుంది. యువతను ప్రోత్సహించటంలో మళ్ళీ వారసులకే ప్రాధన్యత ఇస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తటం ఖాయం. యువతకు టికెట్లివ్వటం వేరు వారసత్వ హోదాలో టికెట్లిచ్చి ప్రోత్సహించటం వేరన్న విషయం గ్రహించాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago