మూడు అంశాల్లో అచ్చంగా కాంగ్రెస్ విధానాలనే బీజేపీ కూడా ఫాలో అవుతోంది. ఇంతకీ ఆ అంశాలు ఏమిటంటే మొదటిది కేంద్ర దర్యాప్తు సంస్ధలను ప్రయోగించటం. రెండోదేమో అవకాశమున్న రాష్ట్రాల్లో ప్రత్యర్ధి ప్రభుత్వాలను పడగొట్టేయటం. ఇక ఫైనల్ గా మూడో అంశం ఏమిటంటే ముఖ్యమంత్రులను మార్చేయటం. ఇపుడీ విషయం ఎందుకంటే మొదటిదేమో అవకాశం దొరకగానే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసింది.
శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి ఏక్ నాథ్ షిండే భాగస్వామ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే శివసేనలో కీలకనేత అయిన షిండేని పావుగా వాడుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసింది. సరే ఇపుడు బీహార్లో తాను అధికార భాగస్వామ్య పార్టీ నుండి ప్రతిపక్షంలోకి వచ్చేసింది. ఇక రెండో అంశాన్ని చూస్తే తరచూ ముఖ్యమంత్రులను మార్చటం. కర్నాటకలో బొమ్మై స్ధానంలో తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారనే ప్రచారం బాగా ఊపందుకుంటోంది.
బొమ్మై ముఖ్యమంత్రయి ఏడాది కూడా అయినట్లులేదు. ఇంతలోనే ముఖ్యమంత్రి మార్పు ఏమిటో అర్ధం కావటం లేదు. అంతకుముందు యడ్యూరప్పను దింపేసి బొమ్మైని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. వచ్చే ఏడాదిలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నది. అప్పటికి కొత్త ముఖ్యమంత్రి వచ్చేస్తారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే కర్నాటకలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత బలం నిజానికి బీజేపీ లేదు. కాంగ్రెస్, జనతాదళ్ ప్రభుత్వాన్ని కూల్చేసి తాను అధికారంలోకి వచ్చింది.
బొమ్మై స్ధానంలో యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన కేంద్రమంత్రి శోభా కరంద్లాజేనే కాబోయే ముఖ్యమంత్రంటు బాగా ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్ప కారణంగానే శోభ కేంద్రమంత్రయ్యారట. తాను సీఎంగా రాజీనామా చేయటానికి శోభను కేంద్రమంత్రివర్గంలో తీసుకోవాలని యడ్యూరప్ప షరతు విధించినట్లు ప్రచారం తెలిసిందే. ఇపుడు మళ్ళీ శోభ సీఎం అంటే యడ్యూరప్పే ముఖ్యమంత్రయినట్లు. గతంలో ఉత్తరాఖండ్ లో కూడా ఐదేళ్ళల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను బీజేపీ మార్చింది. ఇదే ఫార్ములాను కర్నాటకలో కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నట్లుంది. మరి కర్నాటకలో ఏమవుతుందో చూడాలి.
This post was last modified on August 10, 2022 12:13 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…