హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వెలుగుచూసిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. నాలుగురోజుల క్రితం మాధవ్ ఎవరో మహిళలో న్యూడ్ గా మాట్లాడుతున్న వీడియో వెలుగుచూసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియోపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వీడియో వెలుగుచూడగానే మాధవ్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో సదరు వీడియో మార్ఫింగ్ చేసిందని ఎంపీ ఆరోపించారు.
ఆరోపణలు చేసిన మాధవ్ అంతటి ఆగకుండా మీడియా యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని బూతులుతిట్టారు. తాను కురుబ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి కమ్మ సామాజికవర్గంలోని కొందరు కావాలనే తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. అంతేకాకుండా వీడియో వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే వివాదాస్పద వీడియోపై పోలీసుల విచారణ జరుగుతోంది. కానీ అది మార్ఫింగా కాదా అనే విషయం ఇప్పుడప్పుడే బయటకు రాదు, రానివ్వరు. అలా విచారణ కొనసాగుతుంటుంది అంతే.
మరో వైపు మీడియా వీడియోపై పదే పదే వార్తలు, కథనాలు అందిస్తోంది. దాంతో అసలు విషయం మరుగునపడిపోయి కొసరు విషయం పెద్దదైపోయింది. ఇక్కడ కొసరు విషయం ఏమిటంటే సామాజికవర్గాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఎంపీ వైఖరికి వ్యతిరేకంగా కమ్మ సామాజికవర్గంలోని సంఘాలు పెద్దఎత్తున కదిరి, అనంతపురంలో ర్యాలీలు నిర్వహించాయి. ఇదే సమయంలో కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా కురబకుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో పోటీ ర్యాలీలు జరిగాయి. రెండువైపుల ర్యాలీల్లోను ఉద్రిక్తతలు పెరిగిపోవటంతో పోలీసులు ఎంటరవ్వక తప్పలేదు.
కమ్మసంఘం ఆధ్వర్యంలో ఇదే విధమైన ర్యాలీ హైదరాబాద్ లో కూడా జరిగింది. దాంతో కురబకులం ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ లో ర్యాలీకు సన్నాహకాలు మొదలయ్యాయి. మొత్తానికి ఎంపీ వ్యక్తిగత విషయం కాస్త రెండు సామాజికవర్గాల మధ్య గొడవలుగా మారిపోతున్నాయి. సామాజికవర్గాల మధ్య గొడవలు పెరిగిపోతే అసలు విషయమైన వివాదాస్పద వీడియో వ్యవహారం మూలనపడిపోయే అవకాశముంది. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on August 9, 2022 11:56 pm
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…