Political News

కేసీఆర్ పై ఒత్తిడి పెంచేస్తున్న గవర్నర్

తెలంగాణలో గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. ప్రజా సమస్యలపై గవర్నర్ కూడా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజలతోనే మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు డైరెక్ట్ గా ప్రజల్లోకే వెళిపోతున్నారు. తాజాగా ఆందోళనలు చేస్తున్న ఐఐఐటి విద్యార్దులను కలిసి సమస్యలు తెలుసుకునేందుకు గవర్నర్ నేరుగా బాసరకే వెళ్ళటం సంచలనంగా మారింది.

సమస్యల పరిష్కారానికి కొద్దిరోజులుగా విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమకు వైఎస్ ఛాన్సలర్ లేరని, ఫ్యాకల్టీ సరిగాలేదని, హాస్టల్ లో ఫుడ్ బాగుండటం లేదనే కారణాలతో విద్యార్థులు గోలగోల చేస్తున్నారు. హాస్టల్లో భోజనం తిని విద్యార్ధులు ఇప్పటికి మూడుసార్లు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇందుకనే గవర్నర్ రంగంలోకి దిగారు. నేరుగా బాసర వెళ్ళి విద్యార్ధులతోనే ముఖాముఖి మాట్లాడారు.

ప్రభుత్వం తనకివ్వాల్సిన ప్రోటోకాల్ గురించి తానెప్పుడో మరచిపోయినట్లు చెప్పారు. ప్రోటోకాల్ పాటించినా పాటించకపోయినా తాను మాత్రం ప్రజా సమస్యలపై స్పందిస్తునే ఉంటానని ప్రకటించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించటం సంచలనంగా మారింది. 2017 నుండి విద్యార్ధులకు ల్యాప్ ట్యాపులు ఇవ్వటం లేదని ప్రభుత్వంపై  మండిపడ్డారు. వసతి గృహాల నిర్వహణ కూడా బాగా లేదన్నారు. తొందరలోనే మిగిలిన యూనివర్సిటీలను కూడా సందర్శిస్తానని చెప్పారు.

మొత్తానికి కేసీయార్ తో తనకున్న వైరాన్ని గవర్నర్ రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు. నరేంద్ర మోడీతో తనకు పడని కారణంగా ఆ కోపాన్నంతా కేసీఆర్ గవర్నర్ పై చూపిస్తున్నారు. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్  ను కూడా ప్రభుత్వం పాటించటం లేదు. ఇందుకు కేసీయారే బాధ్యత వహించాల్సుంటంది. అంటే గవర్నర్ జనాల్లోకి వెళ్ళకూడదని, సమస్యలు తెలుసుకోకూడదని ఏమీ లేదు. కాకపోతే ఆ బాధ్యత ప్రజాప్రతినిధులది. గవర్నర్ ప్రజల్లోకి వెళ్ళినా సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వమే. అందుకనే మామూలుగా గవర్నర్లు జనాల్లోకి వెళ్ళరు. ఎందుకంటే వెళ్ళినా ఉపయోగముండదు కాబట్టి. కానీ ఇక్కడ కేసీయార్ పై తమిళిసై ఒత్తిడి పెంచేందుకే జనాల్లోకి వెళుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. 

Satya

Recent Posts

ప్రేమలు 2 ఆపేయడం మంచిదే

మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…

42 minutes ago

కంటెంట్ ఉంటే చాలు కోట్లలో కనకవర్షం

కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…

44 minutes ago

పట్టపగలే కారు చీకట్లోకి బికనీర్!

సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…

4 hours ago

వైసీపీ నేతలకు షాకిచ్చిన లేడీ ఆఫీసర్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

రెండు బెనిఫిట్ షోలు సేఫా రిస్కా

పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…

5 hours ago

తేడా అంటూనే డబుల్ సెంచరీ కొట్టింది

దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…

5 hours ago