Political News

కేసీఆర్ పై ఒత్తిడి పెంచేస్తున్న గవర్నర్

తెలంగాణలో గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. ప్రజా సమస్యలపై గవర్నర్ కూడా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజలతోనే మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు డైరెక్ట్ గా ప్రజల్లోకే వెళిపోతున్నారు. తాజాగా ఆందోళనలు చేస్తున్న ఐఐఐటి విద్యార్దులను కలిసి సమస్యలు తెలుసుకునేందుకు గవర్నర్ నేరుగా బాసరకే వెళ్ళటం సంచలనంగా మారింది.

సమస్యల పరిష్కారానికి కొద్దిరోజులుగా విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమకు వైఎస్ ఛాన్సలర్ లేరని, ఫ్యాకల్టీ సరిగాలేదని, హాస్టల్ లో ఫుడ్ బాగుండటం లేదనే కారణాలతో విద్యార్థులు గోలగోల చేస్తున్నారు. హాస్టల్లో భోజనం తిని విద్యార్ధులు ఇప్పటికి మూడుసార్లు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇందుకనే గవర్నర్ రంగంలోకి దిగారు. నేరుగా బాసర వెళ్ళి విద్యార్ధులతోనే ముఖాముఖి మాట్లాడారు.

ప్రభుత్వం తనకివ్వాల్సిన ప్రోటోకాల్ గురించి తానెప్పుడో మరచిపోయినట్లు చెప్పారు. ప్రోటోకాల్ పాటించినా పాటించకపోయినా తాను మాత్రం ప్రజా సమస్యలపై స్పందిస్తునే ఉంటానని ప్రకటించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించటం సంచలనంగా మారింది. 2017 నుండి విద్యార్ధులకు ల్యాప్ ట్యాపులు ఇవ్వటం లేదని ప్రభుత్వంపై  మండిపడ్డారు. వసతి గృహాల నిర్వహణ కూడా బాగా లేదన్నారు. తొందరలోనే మిగిలిన యూనివర్సిటీలను కూడా సందర్శిస్తానని చెప్పారు.

మొత్తానికి కేసీయార్ తో తనకున్న వైరాన్ని గవర్నర్ రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు. నరేంద్ర మోడీతో తనకు పడని కారణంగా ఆ కోపాన్నంతా కేసీఆర్ గవర్నర్ పై చూపిస్తున్నారు. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్  ను కూడా ప్రభుత్వం పాటించటం లేదు. ఇందుకు కేసీయారే బాధ్యత వహించాల్సుంటంది. అంటే గవర్నర్ జనాల్లోకి వెళ్ళకూడదని, సమస్యలు తెలుసుకోకూడదని ఏమీ లేదు. కాకపోతే ఆ బాధ్యత ప్రజాప్రతినిధులది. గవర్నర్ ప్రజల్లోకి వెళ్ళినా సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వమే. అందుకనే మామూలుగా గవర్నర్లు జనాల్లోకి వెళ్ళరు. ఎందుకంటే వెళ్ళినా ఉపయోగముండదు కాబట్టి. కానీ ఇక్కడ కేసీయార్ పై తమిళిసై ఒత్తిడి పెంచేందుకే జనాల్లోకి వెళుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. 

This post was last modified on August 8, 2022 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago