కచ్చితంగా కలిసొస్తుందనే గ్యారెంటీ అయితే లేదు. ఒక్కోసారి వ్యూహం ఎదురుతన్నే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇపుడు కాంగ్రెస్ మునుగోడు ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తే బంతి కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళుతుంది. బహుశా వచ్చే డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగే సాధారణ ఎన్నికలతో కలిపి మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగే అవకాశముందని అనుకుంటున్నారు.
ఆ ఉపఎన్నికలో బీజేపీ తరపున మళ్ళీ రాజగోపాలరెడ్డే పోటీ చేస్తారనటంలో సందేహంలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే రాజగోపాల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. తన రాజీనామాకు ఎంఎల్ఏ చెప్పిన కారణాలన్నీ ఉత్త కథలే అని అందరికీ అర్థమైపోయింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కోపంతో మాత్రమే రాజగోపాల్ కాంగ్రెస్ కు, ఎంఎల్ఏగా రాజీనామా చేసినట్లు అర్ధమైపోయింది. వ్యక్తిగత అజెండాతో రాజీనామా చేసి ఉపఎన్నికను జనాలు స్వాగతిస్తారా ?
ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే 2004 జనరల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ రానికారణంగా వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడైన దానం నాగేందర్ హిమాయత్ నగర్ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీచేశారు. అయితే వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో నాగేందర్ టీడీపీలో ఉండలేక వైఎస్సార్ తో మాట్లాడుకుని రాజీనామా చేసేశారు. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఉపఎన్నికలో దానం గెలుపు నల్లేరుమీద బండినడకే అనుకున్నారు.
అయితే ఆశ్చర్యంగా దానం ఓడిపోయారు. ఎలాంటి కారణంలేకుండానే ఎంఎల్ఏగా రాజీనామాచేసి ఉపఎన్నికలో మళ్ళీ తానేపోటీచేస్తే జనాలు సానుకూలంగా స్పందిచరన్న విషయం అర్ధమైపోయింది. కాబట్టి రేపటి ఎన్నికల్లో రాజగోపాల్ గెలుస్తారనే గ్యారెంటీ ఏమీలేదు. బీజేపీ-కాంగ్రెస్ గొడవల్లో మధ్యలో టీఆర్ఎస్ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే జరిగితే అప్పుడు రాజగోపాల్ పరిస్ధితి ఎలాగుంటుందో.
పెద్దికి మూడో వారంలో మళ్ళీ పికప్ ఉంటుందని, కొత్త సీన్లు జోడించారు కాబట్టి మరోసారి మంచి నెంబర్లు చూడొచ్చని ఆశించిన…
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…