జనసేన పార్టీకున్న అతి పెద్ద బలహీనత.. క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం. ఒక రాజకీయ పార్టీకి అత్యంత అవసరమైంది అదే. క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగకుండా.. ఉన్నత స్థాయిలో ఎంత చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
పార్టీకి ఊపు వచ్చినా.. గ్రౌండ్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసి, కార్యకర్తల్ని మోటివేట్ చేయడం.. తరచూ సమావేశాలు నిర్వహించడం.. ఉన్నత స్థాయి నాయకత్వంతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం.. జనాలతో సంబంధాలు నెరపడం.. వాళ్లను ప్రభావితం చేయడం చాలా అవసరం. అది జరగనంత కాలం పార్టీ బలపడదు.
గత ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురవడానికి ఇదే అత్యంత ముఖ్యమైన కారణం. ఈ విషయం అర్థం చేసుకుని ఇప్పుడైనా క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం గురించి అగ్ర నాయకత్వం ఏమైనా ఆలోచిస్తుందా అని పార్టీ మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు.
ఐతే ఈ దిశగా పెద్ద అడుగు వేసేందుకు జనసేన సన్నద్ధమైనట్లే ఉంది. ఓ టీవీ చర్చలో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. జిల్లాకు 9 వేలమందితో జనసైనికుల్ని ఎంపిక చేసి వివిధ స్థాయిల్లో కమిటీలను సిద్ధం చేశామని.. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లక్షమందితో ఈ జాబితా తయారైందని.. వీరి ద్వారా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి, అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రచించామని ఆయన వెల్లడించారు.
కరోనా లేకుంటే ఎప్పుడో కమిటీలు ప్రకటించేవాళ్లమని.. కార్యక్రమాలు కూడా జరిగేవని.. లాక్ డౌన్ వల్ల ఆగామని ఆయన తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాక ఈ కమిటీల ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు. ఇదే నిజమైతే జనసేన కార్యకర్తలకు మంచి ఊపు రాబోతున్నట్లే, పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కాబోతున్నట్లే.
This post was last modified on July 3, 2020 6:25 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…