Political News

లక్షమందితో జనసేన యాక్షన్ ప్లాన్

జనసేన పార్టీకున్న అతి పెద్ద బలహీనత.. క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం. ఒక రాజకీయ పార్టీకి అత్యంత అవసరమైంది అదే. క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగకుండా.. ఉన్నత స్థాయిలో ఎంత చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

పార్టీకి ఊపు వచ్చినా.. గ్రౌండ్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసి, కార్యకర్తల్ని మోటివేట్ చేయడం.. తరచూ సమావేశాలు నిర్వహించడం.. ఉన్నత స్థాయి నాయకత్వంతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం.. జనాలతో సంబంధాలు నెరపడం.. వాళ్లను ప్రభావితం చేయడం చాలా అవసరం. అది జరగనంత కాలం పార్టీ బలపడదు.

గత ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురవడానికి ఇదే అత్యంత ముఖ్యమైన కారణం. ఈ విషయం అర్థం చేసుకుని ఇప్పుడైనా క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం గురించి అగ్ర నాయకత్వం ఏమైనా ఆలోచిస్తుందా అని పార్టీ మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు.

ఐతే ఈ దిశగా పెద్ద అడుగు వేసేందుకు జనసేన సన్నద్ధమైనట్లే ఉంది. ఓ టీవీ చర్చలో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. జిల్లాకు 9 వేలమందితో జనసైనికుల్ని ఎంపిక చేసి వివిధ స్థాయిల్లో కమిటీలను సిద్ధం చేశామని.. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో లక్షమందితో ఈ జాబితా తయారైందని.. వీరి ద్వారా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి, అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రచించామని ఆయన వెల్లడించారు.

కరోనా లేకుంటే ఎప్పుడో కమిటీలు ప్రకటించేవాళ్లమని.. కార్యక్రమాలు కూడా జరిగేవని.. లాక్ డౌన్ వల్ల ఆగామని ఆయన తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాక ఈ కమిటీల ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు. ఇదే నిజమైతే జనసేన కార్యకర్తలకు మంచి ఊపు రాబోతున్నట్లే, పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కాబోతున్నట్లే.

This post was last modified on July 3, 2020 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

48 minutes ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

51 minutes ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

3 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

4 hours ago