Political News

డైరెక్ట్ ఎటాక్… కసి తీర్చుకుంటున్న రేవంత్ ?

మొహమాటం లేదు. డొంకతిరుగుడు లేదు. చెప్పదలచుకున్నది, అనదలచుకున్నది స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? అవును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే నల్గొండ జిల్లాలో రేవంత్ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో రేవంత్ డైరెక్టు ఎటాక్ మొదలుపెట్టేశారు. 

రాజగోపాల్ ను ఉద్దేశించి నీచ్ కమీన్ కుత్తే లాంటి అనేక ఉపమానాలను ఉపయోగించారు. అమిత్ షా కుక్కలన్నారు. బీజేపీ విసిరే ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి రాజగోపాల్ కాంగ్రెస్ కు ద్రోహం చేసి బీజేపీలోకి వెళుతున్నట్లు మండిపడ్డారు. అరేయ్..ఓరేయ్ అంటు రెచ్చిపోయారు.  నిజానికి రాజగోపాల్ గురించి రేవంత్ ఇంత డైరెక్టుగా తిట్టాల్సిన అవసరమే లేదు. అయినా తిట్టారంటే ఎంఎల్ఏపై తనలో పేరుకుపోయిన కసినంతా రేవంత్ తీర్చుకుంటున్నట్లే అర్ధమవుతోంది.

ఎందుకంటే రేవంత్ ను ఉద్దేశించి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చిన దొంగ, ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా  పట్టుబడిన దొంగ అంటు ఇప్పటికే రాజగోపాల్ చాలాసార్లు డైరెక్టుగానే అన్నారు. గురువారం వరకు రాజగోపాల్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి రేవంత్ ఓపిక పట్టినట్టుగా ఉంది. శుక్రవారం ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసేయటంతో ఇక ఆకాశమే హద్దుగా రేవంత్ రెచ్చిపోతున్నారు. రాజగోపాల్ ను పార్టీ క్యాడర్ ముందు బాగా వీక్ చేయటం, రాజగోపాల్ కు పార్టీ క్యాడర్లో ఏమాత్రం మద్దతు లేదని నిరూపించటమే టార్గెట్ గా రేవంత్ రెచ్చిపోతున్నారు.

రాజగోపాల్ బలమంతా కాంగ్రెస్ క్యాడరేనని క్యాడర్ ఎవరు ఎంఎల్ఏతో వెళ్ళలేదు కాబట్టి ఎంఎల్ఏ నతింగ్ అన్నట్లుగా రేవంత్ మాట్లాడారు. జరగబోయే ఉఫఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోయినా వచ్చే నష్టమేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు. కాకపోతే కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్, రాజగోపాల్ కు బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు.  కాంగ్రెస్ క్యాడర్ సత్తాఏమిటో చాటాల్సిన సమయం వచ్చిందని రేవంత్ చెప్పటం గమనార్హం.

This post was last modified on August 6, 2022 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

40 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago