Political News

అందరినీ జగన్ నిరాశ పరిచారా?

అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అన్నట్లుగా తయారైంది వ్యవహారం. గతంలో చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గురువారం నుండి కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో తాను సమావేశమవుతానని జగన్ గతంలో చెప్పిన విషయం గుర్తుండేవుంటుంది. చెప్పినట్లుగానే కుప్పం నియోజకవర్గం నుండే తన భేటీని మొదలుపెట్టారు. సరే భేటీలో కుప్పంను గెలవాలన్నారు.

సర్పంచ్ నుండి మున్సిపాలిటీ వరకు అన్నీ గెలిచిన వైసీపీ ఎంఎల్ఏగా మాత్రం ఎందుకు గెలవదని ప్రశ్నించారు. కార్యకర్తలంతా మద్దతుగా నిలిస్తే ఎంఎల్సీ భరత్ ఎంఎల్ఏగా గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. భరత్ ఎంఎల్ఏగా గెలిస్తే మంత్రిని చేస్తానని జగన్ బంపరాఫర్ ఇచ్చారు. భరత్ ను మంత్రిని చెస్తానన్న హామీ తప్ప మిగిలిందంతా కొంతకాలంగా జగన్ పదే పదే చెబుతున్నదే. అయితే సమావేశాల సందర్భంగా చాలామంది అనుకున్నదివేరు జరిగింది వేరు.

కార్యకర్తల సమావేశం అంటే నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వంపై జనాల అభిప్రాయాలు ఏమిటి ? ప్రభుత్వం ఇమేజి జనాల్లో ఎలాగుంది అనే విషయాలు తెలుసుకుంటారని అనుకున్నారు. పార్టీ, ప్రభుత్వం పరంగా ఉన్న లోటుపాట్లను కార్యకర్తల ద్వారా జగన్ తెలుసుకుంటారని చాలామంది ఊహించారు. కార్యకర్తలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా దిద్దుబాటు చర్యలకు జగన్ శ్రీకారం చుడతారని నేతలు అంచనాలు వేశారు. అయితే భేటీ జరిగిన తీరుచూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు.

మొదటి నుండి ఎంఎల్ఏలు, నేతల సమావేశాల్లో చెప్పినట్లుగానే జగన్ ఇపుడు కూడా చెప్పారు. అంటే వన్ సైడ్ బ్యాటింగ్ అన్నట్లుగా సమావేశం జరిగింది. పార్టీలో ప్రభుత్వంలోని లోటుపాట్లను తెలుసుకునేందుకే జగన్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించబోతున్నారని అనుకున్నవారు తీవ్ర నిరాశ లోకి వెళ్ళిపోయారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడమే టార్గెట్ గా జగన్ పావులుకదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటో అర్ధం కావటం లేదు. గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్ధితి ఎలాగుందో కార్యకర్తల ద్వారా  తెలుసుకుంటేనే అవసరమైనచోట్ల రిపేర్ చేయచ్చు. లేకపోతే ఇలాంటి సమావేశాలు దండగనే చెప్పాలి.

This post was last modified on August 5, 2022 6:42 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago