Political News

అందరినీ జగన్ నిరాశ పరిచారా?

అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అన్నట్లుగా తయారైంది వ్యవహారం. గతంలో చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గురువారం నుండి కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో తాను సమావేశమవుతానని జగన్ గతంలో చెప్పిన విషయం గుర్తుండేవుంటుంది. చెప్పినట్లుగానే కుప్పం నియోజకవర్గం నుండే తన భేటీని మొదలుపెట్టారు. సరే భేటీలో కుప్పంను గెలవాలన్నారు.

సర్పంచ్ నుండి మున్సిపాలిటీ వరకు అన్నీ గెలిచిన వైసీపీ ఎంఎల్ఏగా మాత్రం ఎందుకు గెలవదని ప్రశ్నించారు. కార్యకర్తలంతా మద్దతుగా నిలిస్తే ఎంఎల్సీ భరత్ ఎంఎల్ఏగా గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. భరత్ ఎంఎల్ఏగా గెలిస్తే మంత్రిని చేస్తానని జగన్ బంపరాఫర్ ఇచ్చారు. భరత్ ను మంత్రిని చెస్తానన్న హామీ తప్ప మిగిలిందంతా కొంతకాలంగా జగన్ పదే పదే చెబుతున్నదే. అయితే సమావేశాల సందర్భంగా చాలామంది అనుకున్నదివేరు జరిగింది వేరు.

కార్యకర్తల సమావేశం అంటే నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వంపై జనాల అభిప్రాయాలు ఏమిటి ? ప్రభుత్వం ఇమేజి జనాల్లో ఎలాగుంది అనే విషయాలు తెలుసుకుంటారని అనుకున్నారు. పార్టీ, ప్రభుత్వం పరంగా ఉన్న లోటుపాట్లను కార్యకర్తల ద్వారా జగన్ తెలుసుకుంటారని చాలామంది ఊహించారు. కార్యకర్తలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా దిద్దుబాటు చర్యలకు జగన్ శ్రీకారం చుడతారని నేతలు అంచనాలు వేశారు. అయితే భేటీ జరిగిన తీరుచూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు.

మొదటి నుండి ఎంఎల్ఏలు, నేతల సమావేశాల్లో చెప్పినట్లుగానే జగన్ ఇపుడు కూడా చెప్పారు. అంటే వన్ సైడ్ బ్యాటింగ్ అన్నట్లుగా సమావేశం జరిగింది. పార్టీలో ప్రభుత్వంలోని లోటుపాట్లను తెలుసుకునేందుకే జగన్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించబోతున్నారని అనుకున్నవారు తీవ్ర నిరాశ లోకి వెళ్ళిపోయారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడమే టార్గెట్ గా జగన్ పావులుకదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పటం వల్ల ఉపయోగం ఏమిటో అర్ధం కావటం లేదు. గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్ధితి ఎలాగుందో కార్యకర్తల ద్వారా  తెలుసుకుంటేనే అవసరమైనచోట్ల రిపేర్ చేయచ్చు. లేకపోతే ఇలాంటి సమావేశాలు దండగనే చెప్పాలి.

This post was last modified on August 5, 2022 6:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

2 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

5 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

5 hours ago