తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పార్టీలో ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రగడ చల్లారకపోయినా.. ఆయన మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. పార్టీనిబలోపేతం చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పొరుగు పార్టీనాయకులను కూడా రేవంత్ ఆకర్షిస్తున్నా రు. దీంతో రాష్ట్రంలో పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెరుకు సుధాకర్తో పాటు ఆ పార్టీ నాయకులు బత్తుల సోమయ్య, సందీప్ చమార్, కాంగ్రెస్ నాయకుడు సత్తు మల్లేష్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీని అధికారంలోకి తెచ్చేదిశగా తాము చర్యలు చేపడుతున్నామ న్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రతి ఒక్కరూ అభిమానంతో ఉన్నారని తెలిపారు. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని.. నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని.. ప్రతి ఒక్కరి కృషితోనే పార్టీ అధికారంలోకి వస్తుందని.. రేవంత్ వ్యాఖ్యానించారు.
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్దేనని అన్నారు. మరింత మంది నాయకులు.. పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఎప్పటికీ బలహీనం కాదని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
This post was last modified on August 5, 2022 2:50 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…