తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పార్టీలో ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రగడ చల్లారకపోయినా.. ఆయన మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. పార్టీనిబలోపేతం చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పొరుగు పార్టీనాయకులను కూడా రేవంత్ ఆకర్షిస్తున్నా రు. దీంతో రాష్ట్రంలో పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెరుకు సుధాకర్తో పాటు ఆ పార్టీ నాయకులు బత్తుల సోమయ్య, సందీప్ చమార్, కాంగ్రెస్ నాయకుడు సత్తు మల్లేష్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీని అధికారంలోకి తెచ్చేదిశగా తాము చర్యలు చేపడుతున్నామ న్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రతి ఒక్కరూ అభిమానంతో ఉన్నారని తెలిపారు. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని.. నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని.. ప్రతి ఒక్కరి కృషితోనే పార్టీ అధికారంలోకి వస్తుందని.. రేవంత్ వ్యాఖ్యానించారు.
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్దేనని అన్నారు. మరింత మంది నాయకులు.. పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒకరిద్దరు పోయినంత మాత్రాన కాంగ్రెస్ ఎప్పటికీ బలహీనం కాదని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
This post was last modified on August 5, 2022 2:50 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…