‘మీరు’ అన్న మాటలో ఎంత తప్పు ఉందన్న విషయం కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. తాజాగా ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి.. బీజేపీలో చేరేందుకు సిద్దమన్న ప్రకటన చేసిన నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లోని ‘మీరు’ పద ప్రయోగంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి చర్యను ‘మీరు’ అన్న పదం వాడటం ద్వారా రేవంత్.. తనను కూడా రాజగోపాల్ జట్టు కట్టేశారని.. తాను అసలుసిసలు కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో తన పేరును ముడేసేలా రేవంత్ రెడ్డి వాడిన ‘మీరు’ మాటకు తనకు క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
తన సోదరుడి పార్టీ ఫిరాయింపుపై ఆయన్నే ప్రశ్నించాలని అంటున్న వెంకటరెడ్డి.. తాను కాంగ్రెస్ కార్యకర్తనని.. పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తానతాని చెప్పారు. తాను కూడా పార్టీ మారతానని మీడియా అనుమానపడుతుందని.. తాను రియాక్టు కావటానికి మరేమీ లేదని అన్నారు. రేవంత్ మాట్లాడే వేళలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనాలే తప్పించి కోమటిరెడ్డి బ్రదర్స్ అనే అర్థం వచ్చేలా మాట్లాడకూడదన్నారు.
34 ఏళ్లుగా పార్టీ కోసం రక్తం ధారపోస్తే ఇప్పుడు అవమానించేలా మాట్లాడతారా? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. రేవంత్ నోటి నుంచి వచ్చిన మీరు మాటకు ఆయన క్షమాపణలు చెబుతారా? ‘మీరు’ అన్న మాటతో కలిగిన అవమానానికి ప్రతిగా పార్టీ నుంచి నిష్క్రమిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.
This post was last modified on August 4, 2022 10:45 pm
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…
నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు.…
రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని…