Political News

హైకోర్టు విష‌యంలో మేం జోక్యం చేసుకోం: కేంద్రం

ఏపీ హైకోర్టును మార్చే విష‌యంపై కేంద్రం మ‌ళ్లీ మ‌ళ్లీ అదే మాట చెబుతోంది. గత పార్ల‌మెంటు స‌మావేశాల్లో.. ఈ విష‌యం త‌మ ప‌రిధిలో లేద‌ని చెప్పిన కేంద్రం.. తాజాగా కూడా ఇదే విష‌యం స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం-ఏపీ హైకోర్టు సంయుక్తంగా ఒక నిర్ణ‌యం తీసుకుని.. త‌మ‌కు పంపిస్తే.. దానిపై చ‌ర్చించి.. రాష్ట్ర‌ప‌తికి ప్ర‌తిపాదిస్తామ‌ని.. హైకోర్టు ప‌రిధిలో తాము జోక్యం చేసుకునేది లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.  

అంతేకాదు, ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మరోసారి తేల్చి చెప్పింది. తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్‌రిజిజు మాట్లాడుతూ విభజన చట్టానికి అనుగుణంగా 2019 జనవరిలో..ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి.. కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.

హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ఏపీ ప్రభుత్వం, హైకోర్టు.. తమ అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖకు సమర్పించాలని చెప్పారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్ర‌తిపాద‌న ఏదీ కూడా త‌మ‌కు చేర‌లేద‌ని.. చెప్పారు. త‌మ ఇష్టానుసారంగా హైకోర్టుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకునేది లేద‌ని.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు స్ప‌ష్టం చేసింది.  ప్రస్తుతం కేంద్రం దగ్గర హైకోర్టును మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

ఇక‌, ఇప్ప‌టికే హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లిస్తున్నామ‌ని.. వైసీపీ నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ, ఇదంతా రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూల పరిస్థితిని మార్చుకునేందుకు.. మాత్ర‌మే చేస్తున్న వ్యూహంగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు.. బీజేపీ కూడా.. క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేస్తే.. స‌హ‌క‌రిస్తామ‌ని చెబుతోంది. కానీ, ఇప్ప‌టికే హైకోర్టు.. అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసినందున దీనిని ఎలా మారుస్తార‌నేది.. ఇప్ప‌టికే హైకోర్టు సంధించిన ప్ర‌శ్న‌. ఏదేమైనా.. హైకోర్టుపై వైసీపీ స‌ర్కారు ఆట‌లు ఆడుతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 4, 2022 7:06 pm

Share

Recent Posts

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

51 minutes ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

52 minutes ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

3 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

8 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

9 hours ago