వైసీపీ ఎంపీలపై ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అవన్నీ.. ఇప్పుడు కాకపోతే.. మరో రోజైనా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉన్నవే. కానీ, ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం సరిదిద్దుకు నే అవకాశం లేనిది. అదే.. హిందూపురం వైసీపీ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ గోరంట్ల మాధవ్కు సంబంధించిన ఒక సంచలన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరు దీనిని చూసినా.. ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏం జరిగిందంటే.. ఎంపీ గోరంట్ల మాధవ్.. ఓ మహిళకు వీడియో కాల్ చేశారు. అయితే.. ఈ క్రమంలో ఆయన చెప్పలేని రీతిలో వ్యవహరించారు. పూర్తి నగ్నంగా ఉన్న మాధవ్.. అటు వైపు ఉన్న మహిళతో ఎలాంటి సంభాషణలు చేశారో తెలియదు కానీ.. సడెన్గా..`చేయరాని` పనిచేసేశారు. దీనిని మీడియాలో ప్రచురించేందుకు కానీ, ప్రసారం చేసేందుకు కానీ, అవకాశమే లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం.
కట్టు తప్పేస్తున్నారా?
వైసీపీ ఎంపీలు చాలా మందిపై.. అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. జగన్ ఎప్పటికప్పుడు.. వాటిని చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. ఇదే అలుసుగా తీసుకుని.. ఇప్పుడు గోరంట్ల రెచ్చిపోయి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. ఇక, ప్రస్తుతం గోరంట్ల వ్యవహారం.. పార్లమెంటులో దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో కనుక నిజమైతే.. ఆయనపై ఎవరూ కోరకుండానే.. అనర్హత వేటు వేసే.. విచక్షణాధికారం.. స్పీకర్కు ఉంటుంది.
పరువు పూర్తిగా పాయే!
మరోవైపు.. తన ఎంపీల కారణంగా.. వైసీపీ అధినేత జగన్ పరువు.. ఇప్పుడు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో పరువు పోతున్న విషయంపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఇక, ఎంపీ చేసిన వికృత చేష్టలతో ఈ పరువు ఢిల్లీ నడిబొడ్డున కూడా పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు.
This post was last modified on August 4, 2022 4:48 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…