రాజకీయాల్లో కొన్ని కొన్ని విషయాలు అంతే! అవి శాశ్వతం కూడా! కొందరు నాయకుల అసంతృప్తి కూడా అంతే. అది ఎప్పటికీ నెరవేరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాంటిదే.. వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి అంటున్నారు పరిశీలకులు. గత కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత.. రాష్ట్ర విభజనతో.. వైసీపీ నుంచి పిలుపు వచ్చినా.. అటుచూడకుండా.. సైకిల్ ఎక్కారు.
అయితే.. ఆయనకు ఎమ్మెల్సీ అయినా.. దక్కుతుందని.. చంద్రబాబు హయాంలో అనుకుంటే.. తనకు ఎక్కడ ప్రత్యర్థిగా కూర్చుంటాడో.. అని.. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అడ్డుపడ్డాడనే వాదన తమ్ముళ్ల మధ్య సాగింది. దీంతో చూసి చూసి.. వేచి వేచి.. వైసీపీలోకి వచ్చారు. లక్కు కలిసి వచ్చింది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే.. తనకు కనీసం గుర్తింపు లేకుండా పోయిందనేది.. ఆయన ఆవేదన. మంత్రి పదవి ఆశించారు. అది దక్కలేదు.
టీటీడీ బోర్డులో సభ్యత్వం ఆశించారు. అది కూడా చిక్కలేదు. పోనీ.. జిల్లా స్థాయి పదవైనా దక్కుతుందని అనుకున్నారు. అది కూడా లభించలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహం.. నిస్పృహలో ఆయన కూరుకుపోయారు. తీవ్ర అసంతృప్తితో కుమిలిపోతున్నారు. పోనీ.. ఇప్పటికిప్పుడు.. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ మారి పోతే.. ఏదైనా ప్రయోజనం ఉంటుందా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. టీడీపీ అయితే.. ఆయన ను ఆహ్వానించొచ్చు. ఆత్మకూరు టికెట్ కూడా ఇవ్వొచ్చు.
కానీ, మంత్రి పదవి మాత్రం ఇచ్చే సమస్యే లేదు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే.. నెల్లూరు జిల్లాలో అనేక మందికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారందరినీ పక్కన పెట్టి ఆనంకు ఇచ్చే అవకాశం లేదు. పోనీ.. వైసీపీలోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో అయినా.. ఆనంకు ప్రాధాన్యం దక్కుతుందా? అంటే.. అది కూడా సాధ్యమయ్యేలా లేదు. ఎంతో మంది సీనియర్లు పదవుల కోసం.. నెల్లూరులో కాచుకుని కూర్చున్నారు. వీరిని కాదని.. ఆనంకు ఇచ్చే సాహసం.. జగన్ చేయబోరనేది జగమెరిగిన సత్యం. సో.. ఎలా చూసుకున్నా.. ఆనం అసంతృప్తి ఇప్పట్లోచల్లారేది కాదని.. అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 4, 2022 3:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…