Political News

మునుగోడులో కూడా హుజూరాబాద్ వ్యూహమే?

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి మొదలైంది.  ఎంఎల్ఏగా రాజీనామా చేస్తున్నట్లు  కోమటిరెడ్డి రాజగోపాల్  ప్రకటించారంతే. ఎప్పుడు చేసేది ఇంకా ఆయన చెప్పలేదు. రాజీనామా చేస్తే, దాన్ని స్పీకర్ ఆమోదిస్తే ఉపఎన్నిక జరిగే అవకాశముంది. అప్పుడు బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ రాజగోపాలే పోటీచేసే అవకాశముంది. కాబట్టి తమ పార్టీల తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయాన్ని ప్రకటించాల్సింది టీఆర్ఎస్, కాంగ్రెస్సే.

సరే కాంగ్రెస్ ను వదిలేస్తే అభ్యర్ధిని ఎంపికచేయటం పూర్తిగా కేసీయార్ నిర్ణయమే అన్న విషయం తెలిసిందే. అభ్యర్ధిని ఎంపిక చేసేముందే హైదరాబాద్ లో అమలుచేసిన వ్యూహాన్నే మునుగోడులో కూడా చేయాలని కేసీయార్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేయటం. ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్ లో ఉపఎన్నిక తప్పదని తేలిపోయిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి.

రోడ్లు, భవనాలు, డ్రైనేజీ కాల్వలు ఏర్పాటు తదితరాలన్నింటినీ కేసీయార్ మొదలు పెట్టేశారు. అలాగే దళిత బంధు లాంటి సంక్షేమపథకాలను ప్రకటించారు. అంటే అప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అర్ధమైంది. మరప్పటి వరకు మంత్రిగానే ఉన్న ఈటెల ఏమి చేశారో జనాలకు అర్థం కాలేదు. సరే ఉపఎన్నిక పుణ్యమాని నియోజకవర్గంలో ఎంతోకొంత అభివృద్ధి జరిగింది. వందల కోట్ల రూపాయలు ఖర్చులుపెట్టినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమి తప్పలేదు.

ఇపుడు మునుగోడులో కూడా అదే సీన్ కనబడుతోంది. రాజగోపాల్ ఆరోపణల ప్రకారం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరిపుడు ఉప ఎన్నికల కారణంగానే రోడ్లు, భవనాల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తొందరలోనే మొదలుపెట్టబోతున్నారట. అలాగే నియోజకర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పథకాలను వర్తింపచేయాలని కేసీయార్ ఆదేశించినట్లు సమాచారం. అంటే ఉప ఎన్నికలు వస్తేకాని నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగదని జనాల్లో క్లారిటీ వచ్చేసింది. మరిక్కడైనా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారా ? 

This post was last modified on August 4, 2022 12:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

54 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

1 hour ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

3 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

6 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

14 hours ago