వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఒకవైపు.. తీవ్రస్థాయిలో పొలిటికల్ సెగ రాజుకుంది. అధికార పార్టీలో కీలక నాయకులు.. పక్క చూపులు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా..వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో.. అనే భావన ఉన్నవారు.. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో రాజకీయాలు మరింత వేడిగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. మరింత మంటపుట్టిస్తున్నాయి.
కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న.. మరో మాటలో చెప్పాలంటే.. కాపులకు కంచుకోట వంటి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన కామెంట్లు చేశారు. ఎవరు ఏ పార్టీకి శాస్వతమో ఎవరికి తెలుసునని అన్నారు. అంతేకాదు.. ఎవరైనా.. పార్టీలు మారే అవకాశం ఉందని.. చెప్పారు.
తాజాగా నూతనంగా సామాజిక పింఛన్కు లబ్దిదారులైన వారికి.. ఆయన పింఛన్లు అందజేశారు. అనంత రం.. నిర్వహించిన సభలో చంటిబాబు మాట్లాడారు. “రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఎవరికి ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. రేపు నేనైనా వేరే పార్టీలో చేరతానేమో. వేరే జెండాపై పోటీ చేస్తానేమో.. ఎవరు చూడొచ్చారు. అందుకే నాయకులతో గొడవలు వద్దు“ అని వ్యాఖ్యానించారు.
ఇక,ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. గత ఎన్నికల్లో చంటిబాబు.. వైసీపీ పక్షాన పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న జ్యోతుల నెహ్రూ.. స్వయానా చంటిబాబుకు బాబాయి కావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జనసేన బలపడే సూచనలు ఉన్నాయని.. కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే చంటిబాబు.. “ముందుచూపుతో“ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on August 3, 2022 9:55 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…