ఏపీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల నాయకులు సర్దిచెప్పి ముందుకెళ్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు టీడీపీ పార్టీకి చెందినవాళ్లు కదా.. మీకెందుకు పనులు చేయాలని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఈ గడపగడప కార్యక్రమం అత్యంత రభసగా మారుతోంది.
అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓ మహిళకు శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం నుంచి చాలా లబ్ధి పొందారని.. ఈసారి తనను ఆశీర్వదించకపోతే పాపం తగులుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సాయం గురించి ప్రజలకు వివరించారు. ఆ క్రమంలోనే.. ప్రభుత్వం నుంచి చాలా పథకాల ద్వారా లబ్ధి పొందారని అన్నారు.
అంతేకాదు.. ఈసారి తనను ఆశీర్వదించాలన్నారు. పోనీ.. అంతటితో ఆయన ఆగారా? అంటే.. లేదు. మీరు నాకు ఓటేయకపోతే.. పాపం తగులుతుందని ఓ మహిళకు శాపనార్థాలు పెట్టారు. “ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అప్పులు చేసి మరీ.. మీరు డబ్బులు ఇస్తున్నాం. మీరు ప్రతిపక్షాల మాయలో పడొద్దు. వారు చెప్పే మాటలు వినొద్దు. నమ్మొద్దు. నా మాట వినండి. నేను మీకు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించా. ప్రభుత్వం కూడా సంక్షేమంపేరుతో డబ్బులు ఇస్తోంది. మీ ఓటు నాకే వేయండి“ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఓ మహిళ.. “అదేంటి సార్.. ఇప్పుడే ఓట్లు అడుగుతున్నారు. అప్పుడే ఎన్నికలు రాలేదుగా!` అని ప్రశ్నించే సరికి.. మంత్రి షాక్ కు గురయ్యారు. ఆ వెంటనే తేరుకుని.. “అలా కాదు.. మీరు ఆళ్ల మాటలు.. ఈళ్ల మాటలు విని.. నాకు ఓటేయరేమోనని చెబుతున్నా. మీ ఓటు నాకే.. వేయాలి. వేయపోతే.. మీ యిష్టం.. మీకే పాపం తగులుతుంది“ అని మంత్రి వ్యాఖ్యానించారు.
This post was last modified on August 3, 2022 9:40 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…