Political News

వైసీపీకి ఓటేయకపోతే పాపం తగులుతుంది: మంత్రి

ఏపీలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న ‘గడప-గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల నాయకులు సర్దిచెప్పి ముందుకెళ్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు టీడీపీ పార్టీకి చెందినవాళ్లు కదా.. మీకెందుకు పనులు చేయాలని కూడా వైసీపీ నాయ‌కులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ఈ గ‌డ‌ప‌గ‌డప కార్య‌క్ర‌మం అత్యంత ర‌భ‌స‌గా మారుతోంది.

అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓ మహిళకు శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం నుంచి చాలా లబ్ధి పొందారని.. ఈసారి తనను ఆశీర్వదించకపోతే పాపం తగులుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సాయం గురించి ప్రజలకు వివరించారు. ఆ క్రమంలోనే.. ప్రభుత్వం నుంచి చాలా పథకాల ద్వారా లబ్ధి పొందారని అన్నారు.

అంతేకాదు.. ఈసారి తనను ఆశీర్వదించాలన్నారు. పోనీ.. అంత‌టితో ఆయ‌న ఆగారా? అంటే.. లేదు. మీరు నాకు ఓటేయ‌క‌పోతే.. పాపం తగులుతుందని ఓ మహిళకు శాపనార్థాలు పెట్టారు. “ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంది. అప్పులు చేసి మ‌రీ.. మీరు డ‌బ్బులు ఇస్తున్నాం. మీరు ప్ర‌తిప‌క్షాల మాయ‌లో ప‌డొద్దు. వారు చెప్పే మాట‌లు వినొద్దు. న‌మ్మొద్దు. నా మాట వినండి. నేను మీకు ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించా. ప్ర‌భుత్వం కూడా సంక్షేమంపేరుతో డ‌బ్బులు ఇస్తోంది. మీ ఓటు నాకే వేయండి“ అని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళ‌.. “అదేంటి సార్‌.. ఇప్పుడే ఓట్లు అడుగుతున్నారు. అప్పుడే ఎన్నిక‌లు రాలేదుగా!` అని ప్ర‌శ్నించే స‌రికి.. మంత్రి షాక్ కు గుర‌య్యారు. ఆ వెంట‌నే తేరుకుని.. “అలా కాదు.. మీరు ఆళ్ల మాట‌లు.. ఈళ్ల మాట‌లు విని.. నాకు ఓటేయ‌రేమోన‌ని చెబుతున్నా. మీ ఓటు నాకే.. వేయాలి. వేయ‌పోతే.. మీ యిష్టం.. మీకే పాపం త‌గులుతుంది“ అని మంత్రి వ్యాఖ్యానించారు.

This post was last modified on August 3, 2022 9:40 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

13 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

29 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago