Political News

ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ రాజకీయం

ఈ కలికాంలో రాజకీయాలు ఇంతకన్నా దిగజారవు అనకున్న ప్రతిసారి అంతకు పది రెట్లు దిగజారిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాలలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం…కానీ, వ్యక్తిగత విమర్శలు మాత్రం కచ్చితంగా ఖండించదగ్గవే. తాజాగా ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ట్రెండింగ్ చేస్తున్న ఓ హ్యాష్ ట్యాగ్ నేటి రాజకీయాలు ఎంతకు దిగజారాయో అద్దం పడుతుంది. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో పలు అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముందు గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేసిన వైసీపీ నేతలు…ఆ తర్వాత సీబీఐ అది గొడ్డలిపోటు అని తేల్చడంతో ఖంగు తిన్నారు.

దీంతో, జగన్, వైసీపీ నేతలకు వ్యతిరేకంగా వివేకా కూతురు సునీతారెడ్డి సైతం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసుతో ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని ఆరోపణలు రావడం, ఈ కేసును జగన్ సరిగ్గా పట్టించుకోవడం లేదని సునీత ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత ‘హూ కిల్డ్ బాబాయ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ప్రతిపక్ష టీడీపీ నేతలు ట్రెండ్ చేశారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు ఏదైనా విషయంలో దొరికితే ఇలాగే ట్రెండ్ చేద్దామని వైసీపీ సోషల్ మీడియా విభాగం కాచుకు కూర్చుంది కాబోలు.

తాజాగా సూసైడ్ చేసుకొని చనిపోయిన కంఠమనేని ఉమా మహేశ్వరి మరణాన్ని వైసీపీ నేత దేవేంద్ర రెడ్డి ట్రెండ్ చేయడం మొదలుబెట్టారు. అయితే ఆత్మహత్య చేసుకున్న ఉమా మహేశ్వరికి…మర్డర్ అని సీబీఐ అధికారులు డిక్లేర్ చేసి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలున్న వివేకా కేసుతో ముడిపెట్టడం కరెక్ట్ కాదని కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా వైసీపీ నేతల . ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ దేవేంద్ర రెడ్డి ట్రెండ్ చేసిన హ్యాష్‌ట్యాగ్ ను వైసీపీ అనుకూల వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. దీంతో, వైసీపీ నేతలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

‘అవతలి వాళ్ళ చావు బతుకుల మీద అవాకులు చవాకులు పేలే పచ్చ పిచ్చ మీడియాకి.. బెడ్రూమ్‌లో వేలాడుతున్న పిన్ని శవం మీద, ఉరి తాడు ఎవరు లాగారో, పది మందికి పైగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వున్న ఎన్టీయార్ కూతురికి అంత ఖర్మ ఎందుకు పట్టిందో డిబేట్లు పెట్టే సత్తా లేదా.? ఇప్పుడు పెట్టండ్రా డిబేట్లు..’ అంటూ వైసీపీ నేత దేవేందర్ రెడ్డి గుర్రంపాటి చేసిన ట్వీట్ వివాదాస్పదమమైంది. అంతేకాదు, రెండు రోజుల క్రితం దివంగత ఉమా మహేశ్వరికి, నారా లోకేష్ కు జుబ్లి హిల్స్ లోని ఆరెకరాల స్థలం విషయంలో వాగ్వాదం జరిగిందని, దీంతో, ఆమెను లోకేష్ దుర్భాషలాడారని, మనస్తాపంతో ఆమె ఉరి వేసుకుందని ప్రచారం చేస్తున్నారు దేవేంద్ర రెడ్డి. మరి ఆయన కామెంట్స్ పై టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 3, 2022 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

1 minute ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

17 minutes ago

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

2 hours ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago