నరేంద్ర మోడీకి ఒక చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాన్పూరులో ఒకటో తరగతి చదువుతున్న కృతి దూబే అనే చిన్నారి తన పెన్సిల్ , ఎరేజర్ పోగొట్టుకున్నదట. ఆ విషయం తెలిసిన ఆపిల్ల తల్లి చిన్నారిని గట్టిగా మందలించింది. ఇదివరకు చాలాసార్లు పెన్సిల్, ఎరేజర్ పోగొట్టుకున్నా పట్టించుకోని తల్లి ఇపుడు మాత్రమే ఎందుకింతగా మందిలించిదో దుబేకి అర్ధంకాలేదు. అయితే ఎవరిద్వారానో అసలు విషయం తెలసుకున్న బాలిక ఏకంగా మోడీకే లేఖ రాసేసింది.
మోడీకి లేఖ ఎందుకు రాసిందంటే ఈమధ్యనే కేంద్రప్రభుత్వం అనేక వస్తువులపైన జీఎస్టీ పెంచేసింది. అలా జీఎస్టీ పెంచటం వల్ల ధరలు పెరిగిపోయిన చాలా వస్తువుల్లో పెన్సిల్, ఎరేజర్ లాంటివి కూడా ఉన్నాయి. దాంతో పెన్సిల్, ఎరేజర్ ను పొగొట్టుకుంటే ఇదివరకులాగా కొనటం కష్టమని చిన్నారిని తల్లి మందలించిందట. దాంతో చిన్నారి మోడీకి రాసిన లేఖలో పెన్సిల్, ఎరేజర్ ధరలను ఇంతగా పెంచేస్తే ఎలాగంటు నిలదీసింది.
పెన్సిల్, ఎరేజర్ ను పోగొట్టుకున్నందుకు తన తల్లి కొడుతోందని ఫిర్యాదు చేసింది. అంటే తన తల్లి తనను కొడుతున్నందుకు మీరే కారణమంటు ఏకంగా మోడీని బాలిక నిందించింది. తరగతిలో ఎవరైనా తన పెన్సిల్, ఎరేజర్ ను దొంగలిస్తే తన పరిస్థితి ఏమిటంటు చాలా అమాయకంగా మోడీని సూటిగా నిలదీసింది. తనకు ఎంతో ఇష్టమైన మ్యాగీ ధరలను కూడా పెంచేయటం ఏమిటంటు నిలదీసింది.
నిజంగా చిన్నారి రాసిన లేఖకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే దేశంలోని కోట్లాదిమంది పిల్లల బాధేమిటో కృతి దుబే లేఖలో బయటపడింది. పెన్సిల్, ఎరేజర్ ధరలతో పాటు మ్యాగీ, పన్నీర్ లాంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవటంపై నెటిజన్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో నిలదీశారు. తమదైన సృజనాత్మక రీతుల్లో సోషల్ మీడియాలో మోడీ నిర్ణయాలను ఎండగట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
This post was last modified on August 1, 2022 2:18 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…