నరేంద్ర మోడీకి ఒక చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాన్పూరులో ఒకటో తరగతి చదువుతున్న కృతి దూబే అనే చిన్నారి తన పెన్సిల్ , ఎరేజర్ పోగొట్టుకున్నదట. ఆ విషయం తెలిసిన ఆపిల్ల తల్లి చిన్నారిని గట్టిగా మందలించింది. ఇదివరకు చాలాసార్లు పెన్సిల్, ఎరేజర్ పోగొట్టుకున్నా పట్టించుకోని తల్లి ఇపుడు మాత్రమే ఎందుకింతగా మందిలించిదో దుబేకి అర్ధంకాలేదు. అయితే ఎవరిద్వారానో అసలు విషయం తెలసుకున్న బాలిక ఏకంగా మోడీకే లేఖ రాసేసింది.
మోడీకి లేఖ ఎందుకు రాసిందంటే ఈమధ్యనే కేంద్రప్రభుత్వం అనేక వస్తువులపైన జీఎస్టీ పెంచేసింది. అలా జీఎస్టీ పెంచటం వల్ల ధరలు పెరిగిపోయిన చాలా వస్తువుల్లో పెన్సిల్, ఎరేజర్ లాంటివి కూడా ఉన్నాయి. దాంతో పెన్సిల్, ఎరేజర్ ను పొగొట్టుకుంటే ఇదివరకులాగా కొనటం కష్టమని చిన్నారిని తల్లి మందలించిందట. దాంతో చిన్నారి మోడీకి రాసిన లేఖలో పెన్సిల్, ఎరేజర్ ధరలను ఇంతగా పెంచేస్తే ఎలాగంటు నిలదీసింది.
పెన్సిల్, ఎరేజర్ ను పోగొట్టుకున్నందుకు తన తల్లి కొడుతోందని ఫిర్యాదు చేసింది. అంటే తన తల్లి తనను కొడుతున్నందుకు మీరే కారణమంటు ఏకంగా మోడీని బాలిక నిందించింది. తరగతిలో ఎవరైనా తన పెన్సిల్, ఎరేజర్ ను దొంగలిస్తే తన పరిస్థితి ఏమిటంటు చాలా అమాయకంగా మోడీని సూటిగా నిలదీసింది. తనకు ఎంతో ఇష్టమైన మ్యాగీ ధరలను కూడా పెంచేయటం ఏమిటంటు నిలదీసింది.
నిజంగా చిన్నారి రాసిన లేఖకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే దేశంలోని కోట్లాదిమంది పిల్లల బాధేమిటో కృతి దుబే లేఖలో బయటపడింది. పెన్సిల్, ఎరేజర్ ధరలతో పాటు మ్యాగీ, పన్నీర్ లాంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవటంపై నెటిజన్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో నిలదీశారు. తమదైన సృజనాత్మక రీతుల్లో సోషల్ మీడియాలో మోడీ నిర్ణయాలను ఎండగట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
This post was last modified on August 1, 2022 2:18 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…