Political News

మోడీకి చిన్నారి లేఖ… ఎరేజర్ ధరపై నిలదీత

నరేంద్ర మోడీకి ఒక చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాన్పూరులో ఒకటో తరగతి చదువుతున్న కృతి దూబే అనే చిన్నారి తన పెన్సిల్ , ఎరేజర్ పోగొట్టుకున్నదట. ఆ విషయం తెలిసిన ఆపిల్ల తల్లి చిన్నారిని గట్టిగా మందలించింది. ఇదివరకు చాలాసార్లు పెన్సిల్, ఎరేజర్ పోగొట్టుకున్నా పట్టించుకోని తల్లి ఇపుడు మాత్రమే ఎందుకింతగా మందిలించిదో దుబేకి అర్ధంకాలేదు. అయితే ఎవరిద్వారానో అసలు విషయం తెలసుకున్న బాలిక ఏకంగా మోడీకే లేఖ రాసేసింది.

మోడీకి లేఖ ఎందుకు రాసిందంటే ఈమధ్యనే కేంద్రప్రభుత్వం అనేక వస్తువులపైన జీఎస్టీ పెంచేసింది. అలా జీఎస్టీ పెంచటం వల్ల ధరలు పెరిగిపోయిన చాలా వస్తువుల్లో పెన్సిల్, ఎరేజర్ లాంటివి కూడా ఉన్నాయి. దాంతో పెన్సిల్, ఎరేజర్ ను పొగొట్టుకుంటే ఇదివరకులాగా  కొనటం కష్టమని చిన్నారిని తల్లి మందలించిందట. దాంతో చిన్నారి మోడీకి రాసిన లేఖలో పెన్సిల్, ఎరేజర్ ధరలను ఇంతగా పెంచేస్తే ఎలాగంటు నిలదీసింది.

పెన్సిల్, ఎరేజర్ ను పోగొట్టుకున్నందుకు తన తల్లి కొడుతోందని ఫిర్యాదు చేసింది. అంటే తన తల్లి తనను కొడుతున్నందుకు మీరే కారణమంటు ఏకంగా మోడీని బాలిక నిందించింది. తరగతిలో ఎవరైనా తన పెన్సిల్, ఎరేజర్ ను దొంగలిస్తే తన పరిస్థితి ఏమిటంటు చాలా అమాయకంగా మోడీని సూటిగా నిలదీసింది. తనకు ఎంతో ఇష్టమైన మ్యాగీ ధరలను కూడా పెంచేయటం ఏమిటంటు నిలదీసింది.

నిజంగా చిన్నారి రాసిన లేఖకు మోడీ ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే దేశంలోని కోట్లాదిమంది పిల్లల బాధేమిటో కృతి దుబే లేఖలో బయటపడింది. పెన్సిల్, ఎరేజర్ ధరలతో పాటు మ్యాగీ, పన్నీర్ లాంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవటంపై నెటిజన్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో నిలదీశారు. తమదైన సృజనాత్మక రీతుల్లో సోషల్ మీడియాలో మోడీ నిర్ణయాలను ఎండగట్టారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. 

This post was last modified on August 1, 2022 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago