ముంబయ్ లో శివసేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం నుండి 9 గంటల పాటు రౌత్లో ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకుని తమ ఆఫీసుకు తీసుకెళ్ళారు. తర్వాత అర్ధరాత్రి రౌత్ ను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. రౌత్ అరెస్టు వెనకాల చాలా పెద్ద వ్యూహమే దాగున్నట్లు సమాచారం. శివసేనకు చీఫ్ ఉద్థవ్ థాక్రే అనేది పేరుకు మాత్రమే.
పార్టీ మొత్తాన్ని నడిపిస్తున్నది సంజయే. సంజయ్ ఏ కారణం వల్లయినా అందుబాటులో ఉండకపోతే థాక్రేకి ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి. థాక్రేకి మించిన కీలకమైన నేత సంజయ్. ఎలాగైనా పార్టీని దెబ్బకొట్టాలన్నది బీజేపీ అగ్రనేతల వ్యూహం. ఇందులో భాగంగానే ముందుగా ఏక్ నాథ్ షిండేకి గాలమేసి దొరికిచ్చుకున్నారు. వాళ్ళనుకున్నట్లే షిండే తిరుగుబాటు లేవదీసి పార్టీని చీల్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు.
తమ మద్దతుదారుడినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని అనుకుని షిండేనే ఏకంగా బీజేపీ సీఎంను చేసేసింది. దాంతో మహారాష్ట్రలో అధికార వ్యవస్ధంతా బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వ పగ్గాలు చేతికొచ్చిన తర్వాత పార్టీపై దృష్టిపెట్టింది. శివసేనను నామరూపాలు లేకుండా చేయాలంటే దాన్ని కూడా నేలమట్టం చేయాలన్న రెండోప్లాన్ మొదలుపెట్టింది. పార్టీపైన థాక్రేకన్నా సంజయ్ కే పట్టెక్కువ. అందుకని ముందుగా రౌత్ సంగతి చూద్దామని అనుకున్నది.
ఇందులో భాగంగానే ఎప్పుడో జరిగిన పాత్రాచాల్ కుంభకోణాన్ని బయటకు తీసింది. ఇందులో రౌత్ కీలకపాత్ర పోసించారన్న ఆరోపణలపై సోదాల తర్వాత అరెస్టు చేయించింది. ఎలాగూ అరెస్టయ్యారు కాబట్టి కొంతకాలం రౌత్ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేరు. ఇదే సమయంలో పార్టీ తమకే చెందుతుందని కోర్టు, ఎన్నికల కమీషన్ దగ్గరున్న వివాదాన్ని షిండేకి అనుకూలంగా పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యిందట. అంటే ప్రభుత్వం పోయి, పార్టీ కూడా జారిపోయిన తర్వాత పార్టీలోని నేతల్లో చాలామంది షిండేవర్గంలోకి వెళ్ళే అవకాశాలున్నాయి. సో తన వ్యూహాలను బీజేపీ తెరవెనుక నుండి జాగ్రత్తగా అమలు చేస్తోందని అర్ధమైపోతోంది.
This post was last modified on August 1, 2022 10:52 am
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…