Political News

ఏపీ ప్ర‌భుత్వ ఖ‌జానాకు ‘కోట్ల కిక్కు’

ఏపీలో మద్య నిషేధం అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా మ‌రో మూడేళ్ల‌పాటు బార్ల‌ను నిర్వ‌హించుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపుతో.. బార్ల య‌జ‌మానులు పోటెత్తారు. పోటీ ప‌డి మ‌రీ.. పాట‌పాడుకుంటున్నారు. అదికూడా.. అధిక మొత్తానికే కావ‌డం.. గ‌మ‌నార్హం. దీంతో జిల్లాల‌కు జిల్లాల్లో రాష్ట్ర ఖ‌జానాకు కోట్ల రూపాయ‌ల మ‌ద్యం ఆదాయం స‌మ‌కూరుతుండ డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. చిన్న పట్టణాల్లోనే రూ.కోటికి పైగా ధరలు పలుకుతున్నాయి. శ‌నివారం మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సింగ్ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-1, జోన్-4లలో బిడ్లను అధికారులు తెరిచారు. రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ బార్లకు రీ-బిడ్డింగ్ జరుగుతోంది.

ఎక్క‌డెక్క‌డ ఎంతెంత‌..?

విశాఖ మహానగరంలో 128 బార్లకు దరఖాస్తులకు ఆహ్వనించగా.. 120 బార్లకు అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులు వచ్చిన వాటిలో 119 బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్శాఖ పచ్చజెండా ఊపింది. విశాఖలో గరిష్ఠంగా రూ.60 లక్షల ధర పలికింది.

క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా 27 బార్లకు లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో ఈ వేలం నిర్వహించగా.. కేవ‌లం 36 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కర్నూలులో 18 బార్లకు 23 మంది అప్లై చేసుకొగా.. ఆదోనిలో 5 బార్లకు ఆరుగురు.. ఎమ్మిగనూరులో 3 బార్లకు ఐదుగురు.. గూడూరులో ఒక్క బారుకు కేవలం ఇద్దరు మాత్రమే అప్లై చేసుకున్నారు. వీరులో లైసెన్స్ కు చెల్లించాల్సిన డబ్బుకు సరిపడా కోడ్ చేసిన వారిని ఎంపిక చేశారు.

తిరుపతిలోని 16 బార్లకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహిస్తున్నారు. బార్‌ ధరలు అత్యధికంగా రూ.కోటీ 59 లక్షలు పలకగా.. అత్యల్పంగా రూ.కోటీ 49 లక్షలు పలికాయి.

కడపలోని ఓ బార్‌కు కోటీ 71 లక్షలు, ప్రొద్టుటూరులో ఒక బార్‌కు కోటీ 30 లక్షలు రూపాయల బిడ్ దాఖలైంది.

విజయనగరం జిల్లాలో 27 బార్లకు ఈ-వేలం ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 26 బార్లకు లైసెన్స్లు ఖరారు చేశారు. రాజాంలో గరిష్ఠంగా రూ.77 లక్షలు.. నెల్లిమర్లలో కనిష్ఠంగా రూ.17 లక్షలు ధరలు పలికాయి. విజయనగరం జిల్లాలో అన్ని బార్లకు రూ.12.22 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తానికి.. ఇంత ఆదాయం వ‌స్తుంటే.. ఇక మ‌ద్య నిషేధం ఎక్క‌డ అని.. విప‌క్ష నాయ‌కులు నోరు వెళ్ల‌బెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 31, 2022 4:28 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

1 minute ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

30 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

56 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago