Political News

కోర్టులపై ఏపీ స్పీకరు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల శాసన మండలిపై విమర్శలు చేసిన ఎపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం దారుణం. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే‘‘ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ఇలా జరగకూడదు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉండటం ఆశ్చర్యం.

ఇది ఇలాగే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు? ఎమ్మెల్యేలు కావడం ఎందుకు? అన్నిటిని కోర్టులే ఆపమని అంటుంటే… ఇక ఈ వ్యవస్థలు ఎందుకు? న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? అంటూ ఆయన ప్రశ్నించిన ఆయన దీనిపై విస్తృతంగా చర్చలు జరగాలి, మేధావులు దీనిపై చర్చించాలి… అని ఆయన అభిప్రాయపడ్డారు.

బాధతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నాము అని చెప్పిన తమ్మినేని సీతారాం. మా నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు కదా అన్న సందేహం వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నాము. మనీ బిల్లును ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ట. నా రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదు అని తమ్మినేని వ్యాఖ్యానించారు.

అయితే, ఇక్కడ ఒక విషయం ప్రస్తావనార్హం… కోర్టుకు ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకునే హక్కులేదు. అయితే, రాజ్యాంగాన్ని మీరినపుడు దానిని మీరకుండా ఆదేశించే హక్కును అదే రాజ్యాంగం కోర్టులకు కల్పించింది. ఇది రాజ్యాంగ నిర్మాణంలో భాగమే.

This post was last modified on July 2, 2020 7:14 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

57 minutes ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

3 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

5 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

8 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

10 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

11 hours ago