Political News

కోర్టులపై ఏపీ స్పీకరు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల శాసన మండలిపై విమర్శలు చేసిన ఎపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం దారుణం. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే‘‘ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ఇలా జరగకూడదు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉండటం ఆశ్చర్యం.

ఇది ఇలాగే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు? ఎమ్మెల్యేలు కావడం ఎందుకు? అన్నిటిని కోర్టులే ఆపమని అంటుంటే… ఇక ఈ వ్యవస్థలు ఎందుకు? న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? అంటూ ఆయన ప్రశ్నించిన ఆయన దీనిపై విస్తృతంగా చర్చలు జరగాలి, మేధావులు దీనిపై చర్చించాలి… అని ఆయన అభిప్రాయపడ్డారు.

బాధతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నాము అని చెప్పిన తమ్మినేని సీతారాం. మా నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు కదా అన్న సందేహం వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నాము. మనీ బిల్లును ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ట. నా రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదు అని తమ్మినేని వ్యాఖ్యానించారు.

అయితే, ఇక్కడ ఒక విషయం ప్రస్తావనార్హం… కోర్టుకు ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకునే హక్కులేదు. అయితే, రాజ్యాంగాన్ని మీరినపుడు దానిని మీరకుండా ఆదేశించే హక్కును అదే రాజ్యాంగం కోర్టులకు కల్పించింది. ఇది రాజ్యాంగ నిర్మాణంలో భాగమే.

suman

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

11 minutes ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

3 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

5 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

6 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

6 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

6 hours ago