వైసీపీలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టేవారి కోసం.. వైసీపీ నాయ కులు ఎదురు చూస్తున్నారు.. గత ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కలిసి వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర, వైసీపీ హవా వంటివి పనిచేశాయి. దీనిని అడ్డు పెట్టుకుని చాలా మంది గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ ఏమేరకు పనిచేస్తుందనేది ప్రశ్నగా మారింది.
దీంతో ఇప్పుడు డబ్బులు లేనిదే పని జరగదని.. వైసీపీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీలు ఇచ్చే దానికన్నా.. తాము ఎక్కువ ఇవ్వాల్సిందేనని.. ముఖ్యంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలను తిరిగి తమ వైపు తిప్పుకొనేందుకు.. ఖచ్చితంగా డబ్బును ఆశ్రయించాల్సిందేనని వారు నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఇది ఎలా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు.. జగన్ కోసం.. చాలా ఖర్చు చేశారు.
ఆయన చేసిన పాదయాత్రకు కానీ.. ఆయన వస్తే.. తమకు మరింత సౌలభ్యం జరుగుతుందని.. అనుకు న్నారు. కానీ. ఇప్పుడు అన్నీ రివర్స్. ఎవరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. దీంతో వ్యాపారులు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కరోనా ఎఫెక్ట్ దీనికి మరింత కలిసి వచ్చింది. దీంతో .. వ్యాపారులు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. పైగా.. జగన్ కన్నా.. టీడీపీనే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చారు.
పైకి అంతా బాగుందని.. అనుకున్నా.. వైసీపీ నేతల్లో ఈ చర్చ భారీగానే జరుగుతోంది. మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతింది. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు… నష్టపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు, వ్యాపార వాణిజ్య వర్గాలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎవరు ఫోన్లు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాట అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 31, 2022 2:03 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…