వైసీపీలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టేవారి కోసం.. వైసీపీ నాయ కులు ఎదురు చూస్తున్నారు.. గత ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కలిసి వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర, వైసీపీ హవా వంటివి పనిచేశాయి. దీనిని అడ్డు పెట్టుకుని చాలా మంది గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ ఏమేరకు పనిచేస్తుందనేది ప్రశ్నగా మారింది.
దీంతో ఇప్పుడు డబ్బులు లేనిదే పని జరగదని.. వైసీపీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీలు ఇచ్చే దానికన్నా.. తాము ఎక్కువ ఇవ్వాల్సిందేనని.. ముఖ్యంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలను తిరిగి తమ వైపు తిప్పుకొనేందుకు.. ఖచ్చితంగా డబ్బును ఆశ్రయించాల్సిందేనని వారు నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఇది ఎలా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు.. జగన్ కోసం.. చాలా ఖర్చు చేశారు.
ఆయన చేసిన పాదయాత్రకు కానీ.. ఆయన వస్తే.. తమకు మరింత సౌలభ్యం జరుగుతుందని.. అనుకు న్నారు. కానీ. ఇప్పుడు అన్నీ రివర్స్. ఎవరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. దీంతో వ్యాపారులు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కరోనా ఎఫెక్ట్ దీనికి మరింత కలిసి వచ్చింది. దీంతో .. వ్యాపారులు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. పైగా.. జగన్ కన్నా.. టీడీపీనే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చారు.
పైకి అంతా బాగుందని.. అనుకున్నా.. వైసీపీ నేతల్లో ఈ చర్చ భారీగానే జరుగుతోంది. మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతింది. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు… నష్టపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు, వ్యాపార వాణిజ్య వర్గాలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎవరు ఫోన్లు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాట అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…