వైసీపీలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టేవారి కోసం.. వైసీపీ నాయ కులు ఎదురు చూస్తున్నారు.. గత ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కలిసి వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర, వైసీపీ హవా వంటివి పనిచేశాయి. దీనిని అడ్డు పెట్టుకుని చాలా మంది గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ ఏమేరకు పనిచేస్తుందనేది ప్రశ్నగా మారింది.
దీంతో ఇప్పుడు డబ్బులు లేనిదే పని జరగదని.. వైసీపీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీలు ఇచ్చే దానికన్నా.. తాము ఎక్కువ ఇవ్వాల్సిందేనని.. ముఖ్యంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలను తిరిగి తమ వైపు తిప్పుకొనేందుకు.. ఖచ్చితంగా డబ్బును ఆశ్రయించాల్సిందేనని వారు నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఇది ఎలా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు.. జగన్ కోసం.. చాలా ఖర్చు చేశారు.
ఆయన చేసిన పాదయాత్రకు కానీ.. ఆయన వస్తే.. తమకు మరింత సౌలభ్యం జరుగుతుందని.. అనుకు న్నారు. కానీ. ఇప్పుడు అన్నీ రివర్స్. ఎవరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. దీంతో వ్యాపారులు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కరోనా ఎఫెక్ట్ దీనికి మరింత కలిసి వచ్చింది. దీంతో .. వ్యాపారులు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. పైగా.. జగన్ కన్నా.. టీడీపీనే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చారు.
పైకి అంతా బాగుందని.. అనుకున్నా.. వైసీపీ నేతల్లో ఈ చర్చ భారీగానే జరుగుతోంది. మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతింది. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు… నష్టపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు, వ్యాపార వాణిజ్య వర్గాలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎవరు ఫోన్లు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాట అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 31, 2022 2:03 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…