వైసీపీలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టేవారి కోసం.. వైసీపీ నాయ కులు ఎదురు చూస్తున్నారు.. గత ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కలిసి వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర, వైసీపీ హవా వంటివి పనిచేశాయి. దీనిని అడ్డు పెట్టుకుని చాలా మంది గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ ఏమేరకు పనిచేస్తుందనేది ప్రశ్నగా మారింది.
దీంతో ఇప్పుడు డబ్బులు లేనిదే పని జరగదని.. వైసీపీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీలు ఇచ్చే దానికన్నా.. తాము ఎక్కువ ఇవ్వాల్సిందేనని.. ముఖ్యంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలను తిరిగి తమ వైపు తిప్పుకొనేందుకు.. ఖచ్చితంగా డబ్బును ఆశ్రయించాల్సిందేనని వారు నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఇది ఎలా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు.. జగన్ కోసం.. చాలా ఖర్చు చేశారు.
ఆయన చేసిన పాదయాత్రకు కానీ.. ఆయన వస్తే.. తమకు మరింత సౌలభ్యం జరుగుతుందని.. అనుకు న్నారు. కానీ. ఇప్పుడు అన్నీ రివర్స్. ఎవరూ సంతోషంగా లేరు. ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. దీంతో వ్యాపారులు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కరోనా ఎఫెక్ట్ దీనికి మరింత కలిసి వచ్చింది. దీంతో .. వ్యాపారులు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. పైగా.. జగన్ కన్నా.. టీడీపీనే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చారు.
పైకి అంతా బాగుందని.. అనుకున్నా.. వైసీపీ నేతల్లో ఈ చర్చ భారీగానే జరుగుతోంది. మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతింది. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు… నష్టపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు, వ్యాపార వాణిజ్య వర్గాలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎవరు ఫోన్లు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. చూద్దాం.. చేద్దాం.. అనే మాట అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 31, 2022 2:03 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…