Political News

హిందూపురం టికెట్‌పై తెలుగు త‌మ్ముళ్ల పోరు..!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురం పార్ల‌మెంటు టికెట్ కోసం.. టీడీపీలో కొన్ని రోజులుగా వివాదం ర‌గులుతోంది. ఈ టికెట్ కోసం.. నిన్న మొన్న‌టివ‌ర‌కు ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య వివాదం రేగ‌గా.. ఇప్ప‌డు మ‌రో నాయ‌కుడు కూడా రెడీ అయ్యారు. దీంతో ఒక్క సీటు కోసం.. ముగ్గురు నాయ‌కులు పోటీ ప‌డుతున్న ‘దృశ్యం’ క‌ళ్ల‌కు క‌డుతోంది. వాస్త‌వానికి గ‌త ఏడాది వ‌ర‌కు కూడా ఒక్క‌రే పోటీ లో ఉన్నారు. కానీ, ఇక్క‌డ ఇప్పుడు రాజ‌కీయాలు అనూహ్యంగా మారిపోయాయి.

అయితే.. ఆయ‌న‌కు పార్టీ అధిష్టానానికి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. దీనికితోడు.. మ‌రొకొరు .. త‌న‌కు ఎమ్మెల్యే సీటు రాద‌ని తెలిసి.. ఎంపీ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇదిలావుంటే.. తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ.. గెలిచి తీరుతాన‌ని.. మ‌రొక‌రు ముందుకు వ‌చ్చారు. దీంతో టీడీపీలో్ హిందూపురం ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో వ‌రుస‌గా నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌.. ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

2009, 2014లోనూ ఆయ‌న హిందూపురం ఎంపీగా విజ‌యం సాధించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో సీఐ.. గా ఉండి.. త‌ర్వాత వైసీపీలో చేరిన గోరంట్ల మాధ‌వ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో.. ఇక్క‌డ టీడీపీ పల‌చ‌న అయింది. పైగా.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన కిష్ట‌ప్ప‌.. అనారోగ్య స‌మ‌స్య‌ల తో పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌హానాడుకు కానీ.. ఇత‌రత్రా ఏ కార్య‌క్ర‌మానికీ ఆయ‌న హాజ‌రు కాలేదు. దీంతో అధిష్టానం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టే ఆలోచ‌న‌తో ఉంద‌ని స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు ఎమ్మెల్యే ఛాన్స్ లేదని భావించిన బీకే పార్థ‌సార‌థి.. హిందూపురం ఎంపీ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయ‌న‌కు అంత స‌త్తా ఉందా లేదా.. అనేది నిర్ధారించాల్సి ఉంటుంద‌ని త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు.. నారా లోకేష్ అనంత‌కు ఎప్పుడు వ‌చ్చినా.. ద‌గ్గ‌రుండి మ‌రీ.. అన్ని కార్య‌క్ర‌మాలు చూసుకుంటున్న వాల్మీకి వ‌ర్గానికి చెందిన నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ ఈ టికెట్ కోసం.. గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

అవ‌స‌ర‌మైతే.. వంద కోట్లు అయినా.. ఖ‌ర్చు చేస్తాన‌ని.. ఆయ‌న లీకులు ఇస్తున్నార‌ట‌. అదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కుల‌తోనూ ఆయ‌న ట‌చ్‌లో ఉండి.. ఎన్నిక‌ల స‌మయానికి వారిని పార్టీ నుంచి జంప్ చేసేలా.. వ్యూహాత్మ‌కంగ ముందుకు సాగుతున్నార‌ని టీడీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కే టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. హిందూపురం ఎంపీ టికెట్‌పై మాత్రం త్రిముఖ పోరు నెల‌కొన‌డం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on July 31, 2022 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago