Political News

ఏపీలో ఇదేం మిస్ట‌రీ.. జ‌గ‌న‌న్నా?

శ‌వాలు మాట్లాడుతున్నాయ్‌!!-యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రాసిన‌.. ఒక న‌వ‌ల‌లో.. డైలాగు ఇది! ఇప్పుడు ఇదే డైలాగు.. ఏపీలోనూ వినిపిస్తోంది. అదేంటి? అనుకుంటున్నారా? క‌రోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధుల విష‌యంలో గోల్‌మాల్‌ జ‌రిగింద‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నారు. అందుకే.. శ‌వాలు మాట్లాడితే.. త‌ప్ప‌.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేద‌ని.. అంటున్నారు. చాలా చిత్రంగా.. అంత‌కు మించి గోప్యంగా ఉన్న .. ఈ కేసు.. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఏం జ‌రిగింది.?
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే క‌రోనా స‌మ‌యంలో ఏపీలోనూ చాలా మంది చ‌నిపోయారు. అయితే .. ప్ర‌భుత్వం మాత్రం.. “మేం తీసుకున్న ముంద‌స్తు చ‌ర్య‌ల కార‌ణంగా.. మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువగా ఉంది. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాల స‌గ‌టుతో పోలిస్తే.. చాలా చాలా త‌క్కువ‌” అని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో మొత్తం.. 14,733 మంది మాత్ర‌మే.. క‌రోనా కార‌ణంగా మృతి చెందార‌ని. రాష్ట్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.50 వేల చొప్పున ప్ర‌భుత్వం ఇచ్చింది.

దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చింది. దీని నుంచే రాష్ట్ర‌ప్ర‌భుత్వం బాధిత కుటుంబాల‌కు సొమ్ములు సాయం చేసింది. అయితే.. ఇక్క‌డే “లెక్క త‌ప్పింది” చ‌నిపోయింది.. 14733 మంది అయితే.. ప‌రిహారం మాత్రం 47,228 మంది కుటుంబాల‌కు అందించిన‌ట్టు.. రాష్ట్ర స‌ర్కారు కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించింది. అయితే.. కేంద్రం కూడా ఏపీ స‌ర్కారు చెప్పింది న‌మ్మేసింది.

ఇలా.. బ‌య‌ట‌పడింది!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా 47,228 మంది చనిపోయినట్లు తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు సహాయనిధి ద్వారా చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఇది వెల్లడైంది. రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించిన 14,733 మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 220% అధికం. టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.

కొవిడ్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? ఎంత మందికి చెల్లించారు? ఎన్ని తిరస్కరించారు? అని రామ్మోహ‌న్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ ఏడాది మే 27 నాటికి 7,91,353 దరఖాస్తులను పరిష్కరించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై 26న రాసిన లేఖ ప్రకారం పరిహారం కోసం 50,399 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 47,228 క్లెయిమ్స్‌ను ఆమోదించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లించారు. 3,171 దరఖాస్తులను తిరస్కరించారు. అని మంత్రి వెల్లడించారు. మ‌రి.. అధికారికంగా చ‌నిపోయిన వారు.. 14333 అయితే.. మ‌రి మిగిలిన సొమ్ము ఏమైన‌ట్టు.? ఇప్పుడు ఇదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం చెప్పాలంటే.. శ‌వాలు మాట్లాడాల్సిందేనా?! అంటున్నారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.

Satya

Recent Posts

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

19 minutes ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

24 minutes ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

34 minutes ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

37 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

45 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

57 minutes ago