Political News

సోముకు షాక్‌… దుమ్ముదులిపేసిన పెద్దాయ‌న‌

క‌ళ్లు మూసుకుని తాగినంత మాత్రాన పిల్లిని ఎవ‌రూ చూడ‌ర‌ని అనుకోవ‌డం త‌ప్పే క‌దా..! అలాగే.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో బీజేపీ నేత‌లు.. ముఖ్యంగా కేంద్రంలోని పెద్ద‌లు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగ‌బోమ‌ని.. చేస్తున్న వ్యాఖ్య‌ల‌ పై సామాన్యులు మండిప‌డుతున్నారు. తాము ఏం చేసినా.. ప్ర‌జ‌లు ఏమీ అన‌రు ధోర‌ణి ఇటీవ‌ల కాలంలో నాయ‌కుల‌కు పెరిగిపోయింది. ఎన్నిక‌లు రాగానే.. ఏమీ తెలియ‌ని అమాయ‌కుల్లా ప్ర‌జల ముందు న‌టించేస్తున్నారు.

అయితే.. ప్ర‌జ‌లు మాత్రం అన్ని విష‌యాల‌ను గుర్తు పెట్టుకుంటున్నారు. కేంద్రం ఏం చేస్తోందో.. రాష్ట్ర పాల‌కులు ఏం చేస్తున్నారో.. రెండు ప్ర‌భుత్వాలు క‌లిసి.. ఏం నాట‌కాలు ఆడుతున్నాయో.. స్ప‌ష్టంగా గ‌మ‌నిస్తున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణే.. తాజాగా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఎదురైన ఘాటు సంఘ‌ట‌న‌. శుక్ర‌వారం.. అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉద్య‌మం మ‌రో రూపంలో ప్రారంభ‌మైంది. రాజ‌ధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పాద‌యాత్ర చేయాల‌ని రైతులు నిర్ణ‌యించుకున్నారు.

వారం రోజుల పాటు ఈ పాద‌యాత్ర‌ను చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. రైతుల ప‌క్షానే తాము ఉన్న‌మని చెప్పేందుకు సోము ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా.. రైతుల పాద యాత్ర‌ను ప్రారంభించి.. కొద్ది దూరం ఆయ‌న కూడా న‌డిచారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన వారితో ఆయ‌న బీజేపీ ప్ర‌మోష‌న్‌పై చ‌ర్చించే ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఓ రైతుతో మాట్లా డుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురించి.. రాజ‌ధాని గురించి మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలోరాజ‌ధాని ప్రాంతానికి చెందిన ఒక పెద్దాయ‌న‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఆ పెద్దాయ‌న వెంట‌నే రియాక్ట‌యి.. వాడు మీరు తోడు తోడుదొంగ‌లై... రాజ‌ధానిని ఇలా నాశ‌నం చేశారు అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అవాక్క‌యిన సోము వీర్రాజు.. ఐదేళ్లు ఆగ‌వ‌య్యా..నువ్వు అంటూ.. అక్క‌డ నుంచి చిర‌చిర‌లాడుతూ.. కొర‌కొర చూస్తూ.. జారుకున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఈ వీడియో.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. ఆ పెద్దాయ‌న ఆగ్ర‌హంలోనూ.. అర్ధం ఉంద‌ని అంటున్నారు.. ప‌రిశీల‌కులు. రాజ‌ధానికి శంకు స్థాప‌న చేసిందే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని ఎలా ఉంద‌ని కూడా ఆయ‌న ఆరా తీయ‌లేదు. క‌నీసం.. నిధుల ఊసు కూడా లేదు. పైగా జ‌గ‌న్‌..మూడు రాజ‌ధానులు అని చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. కూడా అదెలా.. రాజ‌ధాని అమ‌రావ‌తి ఉంది క‌దా! అని అన్న పాపాన పోలేదు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు.. తాజాగా సోముకు షాక్ ఇచ్చారు. మ‌రి ఇప్ప‌టికైనా.. నాయ‌కులు ప్ర‌జ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారో లేదో చూడాలి.

This post was last modified on July 29, 2022 5:14 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

2 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

39 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

56 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago