వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. అసలు టికెట్ దక్కించు కునేదెవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు.. రాష్ట్రంలో అన్ని పార్టీలూ.. ఎవరి వ్యూహాలు వారు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి గెలుపైనా అంత ఈజీకాదని అంటున్నారు. సో.. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇబ్బందిగానే ఉందనేది.. తాజాగా పార్టీ అధిష్టానం చేయించిన సర్వేని బట్టి తెలుస్తోంది. ఇదిలావుంటే.. ముఖ్యంగా మంగళగిరిపై వైసీపీ ఫొకస్ పెట్టింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుస విజయాలు దక్కించుకున్నారు. గత ఎన్ని కల్లో నారా లోకేష్ను ఆయన ఓడించారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు యూటర్న్ తీసుకుందని అంటున్నారు. అది కూడా స్థానికంగా చేయించిన అంతర్గత సర్వేలో .. ఆళ్లకు పెద్దగా మార్కులు పడలేదని.. వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. ఆదిలో బాగానే ఉన్నప్పటికీ.. ఆళ్ల ఇప్పుడు ప్రజల మధ్య ఉండడం లేదు. ఇది వాస్తవం.
ఇటీవల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా.. గత ఎన్నికల్లోఇచ్చిన హామీలను ప్రజలు ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలు.. గురించి.. ప్రధానంగా ఇక్కడివారు ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై ఆయన ఎవరికీ సమాధానం చెప్పలేక పోయారు. ఇక, క్లాస్జనాలకు వచ్చే సరికి.. పన్నులపై ఎక్కువగా ఆళ్లను నిలదీశారు. చెత్తపన్నులపై.. మహిళలు ప్రశ్నించారు. వాస్తవానికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ, ఇక్కడ ప్రజలు మాత్రం ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు.
ఈ పరిణామాలకు తోడు.. స్థానికంగా.. ఆయన ప్రజల మధ్య ఉండడం లేదని.. తాడేపల్లి పార్టీ కార్యాలయం లోనే ఉంటున్నారనేది మరో.. విమర్శ. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యక్తిగతంగానే.. ఆళ్ల పలుకుబడిపైనా.. ఆయన ఇమేజ్పైనా తీవ్ర ప్రభావం పడిందని అంటున్నారు. మరోవైపు లోకేష్ ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ సారి సానుభూతి కనిపిస్తోంది.
దీనికి తోడు రాజధాని మార్పు ఎఫెక్ట్ చాలా ఎక్కువుగా మంగళగిరిలో ఉంది. పైగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల నియోజకవర్గానికి చేసిందేమి లేదన్న విమర్శలు స్థానికంగానే ఉన్నాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగితే.. మూడోసారి ఆళ్ల గెలుపు కష్టమేనని.. ఈ సారి బంపర్ మెజారిటీతో అయినా.. టీడీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
This post was last modified on July 29, 2022 5:06 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…