Political News

మళ్ళీ చంద్రబాబు జై తెలంగాణ‌

తెలంగాణ‌లోనూ టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై చర్చించారు. స్థానిక సమస్యలను నేతలు… చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని నేతలు చంద్రబాబుని కోరారు. తప్పక హాజరవుతానన్న హామీ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వవైభవానికి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు. భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరయ్య చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని చంద్రబాబును కోరారు.

విలీన గ్రామాలైన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం ప్రజలు జేఏసీ నేతలు చంద్రబాబుని కలిశారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఉండలేమని తెలంగాణాలో కలపిందుకు చొరవ చూపాలని వినతిపత్రం అందచేశారు.

భద్రాచలంలో గోదావరి కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉంటాయన్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని స్పష్టం చేశారు.

అనంతరం చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రబాబుకు ఈవో శివాజీ ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయంలో చంద్రబాబుకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో… శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబును కలిసేందుకు తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

This post was last modified on July 29, 2022 5:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

1 hour ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

3 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

4 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

5 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

5 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

6 hours ago