Political News

మళ్ళీ చంద్రబాబు జై తెలంగాణ‌

తెలంగాణ‌లోనూ టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై చర్చించారు. స్థానిక సమస్యలను నేతలు… చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని నేతలు చంద్రబాబుని కోరారు. తప్పక హాజరవుతానన్న హామీ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వవైభవానికి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు. భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరయ్య చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని చంద్రబాబును కోరారు.

విలీన గ్రామాలైన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం ప్రజలు జేఏసీ నేతలు చంద్రబాబుని కలిశారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఉండలేమని తెలంగాణాలో కలపిందుకు చొరవ చూపాలని వినతిపత్రం అందచేశారు.

భద్రాచలంలో గోదావరి కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉంటాయన్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని స్పష్టం చేశారు.

అనంతరం చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రబాబుకు ఈవో శివాజీ ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయంలో చంద్రబాబుకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో… శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబును కలిసేందుకు తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.

This post was last modified on July 29, 2022 5:08 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

47 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

60 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

1 hour ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

8 hours ago