తెలంగాణలోనూ టీడీపీని పరుగులు పెట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై చర్చించారు. స్థానిక సమస్యలను నేతలు… చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
సెప్టెంబర్లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని నేతలు చంద్రబాబుని కోరారు. తప్పక హాజరవుతానన్న హామీ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వవైభవానికి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని చంద్రబాబును కోరారు.
విలీన గ్రామాలైన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం ప్రజలు జేఏసీ నేతలు చంద్రబాబుని కలిశారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఉండలేమని తెలంగాణాలో కలపిందుకు చొరవ చూపాలని వినతిపత్రం అందచేశారు.
భద్రాచలంలో గోదావరి కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉంటాయన్నారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని స్పష్టం చేశారు.
అనంతరం చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రబాబుకు ఈవో శివాజీ ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయంలో చంద్రబాబుకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో… శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబును కలిసేందుకు తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
This post was last modified on July 29, 2022 5:08 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…