వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ తనయ షర్మిలపై టీఆర్ఎస్ కీలక నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజన్న రాజ్యం కావాలని ఎవరైనా అనుకుంటే.. వాళ్లు తక్షణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్నకు వ్యతిరేక రాజ్యం. రాజన్న(వైఎస్)తెలంగాణ విషయంలో ఏమన్నాడో.. వాళ్లు(షర్మిల అండ్ కో) మరిచిపోయినా.. తెలంగాణ సమాజం మాత్రం మరిచిపోలేదు. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్రజలే తరిమేస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. ఏపీ నుంచి ఎవరైనా తెలంగాణణకు రావాలంటే.. వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుందని.. వైఎస్ అనలేదా? ఆ విషయంపై షర్మిల ఏం సమాధానం చెబుతారో చూస్తామని అన్నారు.
గతం తెలియని.. వాళ్లు.. గతం గురించి మరిచిపోయిన వాళ్లు ఇప్పుడు వచ్చి.. తెలంగాణ కోసం.. ఏదో చేస్తామంటే.. ఇక్కడున్న ప్రజలు పిచ్చివాళ్లని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. వైఎస్ బొమ్మతో ఓట్లు అడుక్కుంటుమంటే.. ఇక్కడ షర్మిల పప్పులు ఉడకవ్ అని గుత్తా ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
తెలంగాణను సంప్రదించకుండానే పోలవరంలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మద్రాస్లో కలిపేస్తామంటే..ఊరుకుంటారా? అని ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమే నన్నారు.
మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి… రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.
This post was last modified on July 29, 2022 1:51 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…