వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ తనయ షర్మిలపై టీఆర్ఎస్ కీలక నాయకుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజన్న రాజ్యం కావాలని ఎవరైనా అనుకుంటే.. వాళ్లు తక్షణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్నకు వ్యతిరేక రాజ్యం. రాజన్న(వైఎస్)తెలంగాణ విషయంలో ఏమన్నాడో.. వాళ్లు(షర్మిల అండ్ కో) మరిచిపోయినా.. తెలంగాణ సమాజం మాత్రం మరిచిపోలేదు. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్రజలే తరిమేస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. ఏపీ నుంచి ఎవరైనా తెలంగాణణకు రావాలంటే.. వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుందని.. వైఎస్ అనలేదా? ఆ విషయంపై షర్మిల ఏం సమాధానం చెబుతారో చూస్తామని అన్నారు.
గతం తెలియని.. వాళ్లు.. గతం గురించి మరిచిపోయిన వాళ్లు ఇప్పుడు వచ్చి.. తెలంగాణ కోసం.. ఏదో చేస్తామంటే.. ఇక్కడున్న ప్రజలు పిచ్చివాళ్లని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. వైఎస్ బొమ్మతో ఓట్లు అడుక్కుంటుమంటే.. ఇక్కడ షర్మిల పప్పులు ఉడకవ్ అని గుత్తా ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
తెలంగాణను సంప్రదించకుండానే పోలవరంలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మద్రాస్లో కలిపేస్తామంటే..ఊరుకుంటారా? అని ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమే నన్నారు.
మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి… రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.
This post was last modified on July 29, 2022 1:51 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…