Political News

‘రాజ‌న్న రాజ్యం కావాలంటే.. ష‌ర్మిల ఏపీకి పోవాలి’

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ త‌న‌య ష‌ర్మిల‌పై టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “రాజ‌న్న రాజ్యం కావాల‌ని ఎవ‌రైనా అనుకుంటే.. వాళ్లు త‌క్ష‌ణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్న‌కు వ్య‌తిరేక రాజ్యం. రాజ‌న్న(వైఎస్‌)తెలంగాణ విష‌యంలో ఏమన్నాడో.. వాళ్లు(ష‌ర్మిల అండ్ కో) మ‌రిచిపోయినా.. తెలంగాణ స‌మాజం మాత్రం మ‌రిచిపోలేదు. ఈ విష‌యాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్ర‌జ‌లే త‌రిమేస్తారు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. ఏపీ నుంచి ఎవ‌రైనా తెలంగాణ‌ణ‌కు రావాలంటే.. వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుంద‌ని.. వైఎస్ అనలేదా? ఆ విష‌యంపై ష‌ర్మిల ఏం స‌మాధానం చెబుతారో చూస్తామ‌ని అన్నారు.

గ‌తం తెలియ‌ని.. వాళ్లు.. గ‌తం గురించి మరిచిపోయిన వాళ్లు ఇప్పుడు వ‌చ్చి.. తెలంగాణ కోసం.. ఏదో చేస్తామంటే.. ఇక్క‌డున్న ప్ర‌జ‌లు పిచ్చివాళ్ల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైఎస్ బొమ్మ‌తో ఓట్లు అడుక్కుంటుమంటే.. ఇక్క‌డ ష‌ర్మిల ప‌ప్పులు ఉడ‌క‌వ్ అని గుత్తా ఘాటు వ్యాఖ్య‌లు సంధించారు.

తెలంగాణను సంప్రదించకుండానే పోల‌వ‌రంలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మ‌ద్రాస్లో క‌లిపేస్తామంటే..ఊరుకుంటారా? అని ఏపీ మంత్రుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమే నన్నారు.

మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి… రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.

This post was last modified on July 29, 2022 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

1 hour ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

3 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

4 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

5 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

5 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

6 hours ago