Political News

‘రాజ‌న్న రాజ్యం కావాలంటే.. ష‌ర్మిల ఏపీకి పోవాలి’

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ త‌న‌య ష‌ర్మిల‌పై టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “రాజ‌న్న రాజ్యం కావాల‌ని ఎవ‌రైనా అనుకుంటే.. వాళ్లు త‌క్ష‌ణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్న‌కు వ్య‌తిరేక రాజ్యం. రాజ‌న్న(వైఎస్‌)తెలంగాణ విష‌యంలో ఏమన్నాడో.. వాళ్లు(ష‌ర్మిల అండ్ కో) మ‌రిచిపోయినా.. తెలంగాణ స‌మాజం మాత్రం మ‌రిచిపోలేదు. ఈ విష‌యాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్ర‌జ‌లే త‌రిమేస్తారు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. ఏపీ నుంచి ఎవ‌రైనా తెలంగాణ‌ణ‌కు రావాలంటే.. వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుంద‌ని.. వైఎస్ అనలేదా? ఆ విష‌యంపై ష‌ర్మిల ఏం స‌మాధానం చెబుతారో చూస్తామ‌ని అన్నారు.

గ‌తం తెలియ‌ని.. వాళ్లు.. గ‌తం గురించి మరిచిపోయిన వాళ్లు ఇప్పుడు వ‌చ్చి.. తెలంగాణ కోసం.. ఏదో చేస్తామంటే.. ఇక్క‌డున్న ప్ర‌జ‌లు పిచ్చివాళ్ల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైఎస్ బొమ్మ‌తో ఓట్లు అడుక్కుంటుమంటే.. ఇక్క‌డ ష‌ర్మిల ప‌ప్పులు ఉడ‌క‌వ్ అని గుత్తా ఘాటు వ్యాఖ్య‌లు సంధించారు.

తెలంగాణను సంప్రదించకుండానే పోల‌వ‌రంలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మ‌ద్రాస్లో క‌లిపేస్తామంటే..ఊరుకుంటారా? అని ఏపీ మంత్రుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమే నన్నారు.

మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి… రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.

This post was last modified on July 29, 2022 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమ్మినేని తనయుడి పొలిటికల్ పాట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…

8 minutes ago

దురంధర్ మీద రాళ్ళూ పూలూ విసురుతున్నారు

మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…

33 minutes ago

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

4 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

4 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

6 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

6 hours ago