Political News

‘రాజ‌న్న రాజ్యం కావాలంటే.. ష‌ర్మిల ఏపీకి పోవాలి’

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ త‌న‌య ష‌ర్మిల‌పై టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “రాజ‌న్న రాజ్యం కావాల‌ని ఎవ‌రైనా అనుకుంటే.. వాళ్లు త‌క్ష‌ణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్న‌కు వ్య‌తిరేక రాజ్యం. రాజ‌న్న(వైఎస్‌)తెలంగాణ విష‌యంలో ఏమన్నాడో.. వాళ్లు(ష‌ర్మిల అండ్ కో) మ‌రిచిపోయినా.. తెలంగాణ స‌మాజం మాత్రం మ‌రిచిపోలేదు. ఈ విష‌యాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్ర‌జ‌లే త‌రిమేస్తారు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. ఏపీ నుంచి ఎవ‌రైనా తెలంగాణ‌ణ‌కు రావాలంటే.. వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుంద‌ని.. వైఎస్ అనలేదా? ఆ విష‌యంపై ష‌ర్మిల ఏం స‌మాధానం చెబుతారో చూస్తామ‌ని అన్నారు.

గ‌తం తెలియ‌ని.. వాళ్లు.. గ‌తం గురించి మరిచిపోయిన వాళ్లు ఇప్పుడు వ‌చ్చి.. తెలంగాణ కోసం.. ఏదో చేస్తామంటే.. ఇక్క‌డున్న ప్ర‌జ‌లు పిచ్చివాళ్ల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వైఎస్ బొమ్మ‌తో ఓట్లు అడుక్కుంటుమంటే.. ఇక్క‌డ ష‌ర్మిల ప‌ప్పులు ఉడ‌క‌వ్ అని గుత్తా ఘాటు వ్యాఖ్య‌లు సంధించారు.

తెలంగాణను సంప్రదించకుండానే పోల‌వ‌రంలోని ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాస్లో ఉందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మ‌ద్రాస్లో క‌లిపేస్తామంటే..ఊరుకుంటారా? అని ఏపీ మంత్రుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని.. ప్రకృతి వైపరీత్యమే నన్నారు.

మునుగోడులో ఉపఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోగడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి… రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని.. రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధమేమిటన్నారు.

This post was last modified on July 29, 2022 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాక్సిక్ అయోమయం ఇంకొకరికి వరం

కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…

57 minutes ago

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

4 hours ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

5 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

5 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

5 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

8 hours ago