వేలాదిమంది వైద్య విద్యార్ధులు నిండా మునిగి పోయినట్లే అనిపిస్తోంది. వీరంతా ఉక్రెయిన్లో వైద్య విద్య చదవటానికి వెళ్ళి తిరిగి వచ్చేసినవారే. ఉక్రెయిన్లో చదువుకునేందుకు ఇండియా నుండి సుమారు 25 వేల మంది వెళ్ళారు. వీరిలో 20 వేలమంది వైద్య విద్యను చదువుతున్నారు. యుద్ధం మొదలవ్వటానికి ముందే వీళ్ళల్లో అత్యధికుల వైద్య విద్య అయిపోయింది. కాకపోతే ఫైనల్ పరీక్షలు జరగాల్సుండగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
కొద్దిరోజుల్లో యుద్ధం అయిపోతుందని తమ చదువు అయిపోతుందని భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. యుద్ధం మొదలైన సుమారు 20 రోజులకు విదేశాల నుండి వచ్చి చదువుకుంటున్న వారందరినీ ఉక్రెయిన్ ప్రభుత్వం పంపేసింది. అంతకుముందే చాలా దేశాలు ఉక్రెయిన్ తో మాట్లాడుకుని తమ దేశాలకు చెందిన వాళ్ళందరినీ పిలపించేసుకున్నాయి. యుద్ధం కారణంగా వైద్య విద్యార్ధులు కూడా మనదేశానికి వచ్చేశారు.
ఇప్పుడిక్కడ సమస్యేమిటంటే ఉక్రెయిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను ఇండియాలో పూర్తిచేయటానికి అనుమతివ్వాలంటు గోల మొదలుపెట్టారు. దీనికి కేంద్రప్రభుత్వం కుదరదని చెప్పేసింది. ఒకరినో ఇద్దరినో అయితే ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసే అవకాశాలున్నాయోమో. కానీ ఇక్కడ సర్దుబాటు చేయాల్సింది ఏకంగా 20 వేల మందిని. ఇన్ని వేల మందిని ప్రభుత్వం లేదా ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడా సర్దుబాటు చేసేందుకు లేదు. ఉక్రెయిన్ నుండి వచ్చేసిన వారిలో ఐదు, ఆరో సంవత్సరాల విద్యార్ధులే.
ఉక్రెయిన్లో మెడిసిన్ అంటే 6 ఏళ్ళు చదవాలి. ఇన్ని వేల మందిని సర్దుబాటు చేయటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పేసింది. విద్యార్ధులేమో ముందు తమకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించాలని కోరారు. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలిస్తుండగానే కొందరు సుప్రిం కోర్టులో కేసు వేశారు. సుప్రింకోర్టు కూడా వీరి విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. అయితే నియమ, నిబంధలను పరిశీలించిన కేంద్రం ఫైనల్ గా వీరికి అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసింది. ఇపుడు కేంద్రంపై విద్యార్ధులంతా మండిపోతున్నారు. చివరకు ఈ వివాదం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 29, 2022 11:43 am
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…