Political News

నిండా మునిగిపోయిన విద్యార్థులు

వేలాదిమంది వైద్య విద్యార్ధులు నిండా మునిగి పోయినట్లే అనిపిస్తోంది. వీరంతా ఉక్రెయిన్లో వైద్య విద్య చదవటానికి వెళ్ళి తిరిగి వచ్చేసినవారే. ఉక్రెయిన్లో చదువుకునేందుకు ఇండియా నుండి సుమారు 25 వేల మంది వెళ్ళారు. వీరిలో 20 వేలమంది వైద్య విద్యను చదువుతున్నారు. యుద్ధం మొదలవ్వటానికి ముందే వీళ్ళల్లో అత్యధికుల వైద్య విద్య అయిపోయింది. కాకపోతే ఫైనల్ పరీక్షలు జరగాల్సుండగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

కొద్దిరోజుల్లో యుద్ధం అయిపోతుందని తమ చదువు అయిపోతుందని భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. యుద్ధం మొదలైన సుమారు 20 రోజులకు విదేశాల నుండి వచ్చి చదువుకుంటున్న వారందరినీ ఉక్రెయిన్ ప్రభుత్వం పంపేసింది. అంతకుముందే చాలా దేశాలు ఉక్రెయిన్ తో మాట్లాడుకుని తమ దేశాలకు చెందిన వాళ్ళందరినీ పిలపించేసుకున్నాయి. యుద్ధం కారణంగా వైద్య విద్యార్ధులు కూడా మనదేశానికి వచ్చేశారు.

ఇప్పుడిక్కడ సమస్యేమిటంటే ఉక్రెయిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను ఇండియాలో పూర్తిచేయటానికి అనుమతివ్వాలంటు గోల మొదలుపెట్టారు. దీనికి కేంద్రప్రభుత్వం కుదరదని చెప్పేసింది. ఒకరినో ఇద్దరినో అయితే ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసే అవకాశాలున్నాయోమో. కానీ ఇక్కడ సర్దుబాటు చేయాల్సింది ఏకంగా 20 వేల మందిని. ఇన్ని వేల మందిని ప్రభుత్వం లేదా ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడా సర్దుబాటు చేసేందుకు లేదు. ఉక్రెయిన్ నుండి వచ్చేసిన వారిలో ఐదు, ఆరో సంవత్సరాల విద్యార్ధులే.

ఉక్రెయిన్లో మెడిసిన్ అంటే 6 ఏళ్ళు చదవాలి. ఇన్ని వేల మందిని సర్దుబాటు చేయటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పేసింది. విద్యార్ధులేమో ముందు తమకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించాలని కోరారు. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలిస్తుండగానే కొందరు సుప్రిం కోర్టులో కేసు వేశారు. సుప్రింకోర్టు కూడా వీరి విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. అయితే నియమ, నిబంధలను పరిశీలించిన కేంద్రం ఫైనల్ గా వీరికి అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసింది. ఇపుడు కేంద్రంపై విద్యార్ధులంతా మండిపోతున్నారు. చివరకు ఈ వివాదం ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 29, 2022 11:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

2 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

5 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago