Political News

మునుగోడు ‘రిజ‌ల్ట్’.. ఎవ‌రికి అనుకూలం?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా చేయ‌లేదు. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ, తెర‌వెనుక .. ఆయ‌న రాజ‌కీయాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఆయ‌న రేపో మాపో.. బీజేపీలోకి చేరిపోవ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఆయ‌న బీజేపీ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యేగా కొన‌సాగవ‌చ్చు. ఎవ‌రూ ఆయ‌న‌కు అభ్యంత‌రం చెప్ప‌రు.

ఎందుకంటే.. ఇప్ప‌టికే కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన చాలా మంది నాయ‌కులు అధికార పార్టీలో చేరి.. మంత్రి ప‌ద‌వులు సైతం పొందారు. వారు త‌మ ఎమ్మెల్యే స్థానాల‌కు రాజీనామా చేయ‌లేదు. కానీ, ఇప్పుడు.. రాజ‌గోపాల్ మాత్రం రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. మునుగోడు ఫ‌లితం ఎవ‌రికి అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంటుంది? అనేది పెద్ద చ‌ర్చ‌. ఎందుకంటే.. మునుగోడులో రాజ‌గోపాల్ రాజీనామా చేసినంత మాత్రాన ఆయ‌న‌పై సింప‌తీ .. వ‌స్తుంద‌ని అనుకునే ప‌రిస్థితి లేదు.

అదేస‌మ‌యంలో ఇక్క‌డ బీజేపీ కూడా బ‌లంగా లేదు. గ‌తంలో టీఆర్ఎస్‌.. తర్వాత కాంగ్రెస్ పార్టీలే ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. 1967 నుంచి జ‌రిగిన ఎన్నిక‌లు గ‌మ‌నిస్తే.. పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. వ‌రుస‌గా కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. క‌మ్యూనిస్టులు వ‌రుస‌గా విజ‌యం సాధించారు. 2004, 2009 ఎన్నిక‌ల్లోనూ క‌మ్యూనిస్టులు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మాత్రం.. టీఆర్ఎస్ విజ‌యం ద‌క్కించుకుంది. 2014లో బీజేపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసిన‌.. గంగిడి మ‌నోహ‌ర్‌రెడ్డి కేవ‌లం 27 వేల ఓట్లు మాత్ర‌మే సాధించారు.

ఇక‌, 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ త‌ర‌ఫున కోమటిరెడ్డి రాజ‌గోపాల్ విజ‌యం సాధించారు. అయితే.. ఈయ‌న కేవ‌లం 22 వేల 552 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన కె. ప్ర‌భాక‌ర్‌రెడ్డి 74 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్ప‌టికిప్పుడు.. ఉప పోరు క‌నుక వ‌స్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే హోరా హోరీ పోరు ఉండే అవ‌కాశమే ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే.. బీజేపీకి ఇక్క‌డ ఓటు బ్యాంకు శూన్యం.

పోనీ.. హుజూరాబాద్ మాదిరిగా.. అక్క‌డ ఈట‌ల వ‌రుస విజ‌యాలు సాధించిన‌ట్టుగా.. ఇక్క‌డేమీ.. కోమ‌టిరెడ్డి.. వ‌రుస‌గా పోటీ చేసింది లేదు.. ఆయ‌న గెలిచింది కూడా లేదు. దీంతో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ వ‌ర్సెస్ టీఆర్ఎస్ వ‌ర్గం మ‌ధ్యే మ‌రోసారి పోటీ ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే.. కోమ‌టిరెడ్డి సింప‌తీ ఏమైనా ప‌నిచేస్తుందా? అంటే.. ఆయ‌న‌ను ఎవ‌రూ కాంగ్రెస్‌లో ప‌క్క‌న పెట్టింది లేదు.. ఆయ‌న‌ను పొమ్మ‌ని పొగ‌బెట్టింది అంత‌క‌న్నా లేదు. అంటే.. సింప‌తీకి కూడా(ఈట‌ల మాదిరిగా) అవ‌కాశం లేదు. ఇలా.. ఎటు వైపు చూసుకున్నా.. కోమ‌టిరెడ్డి గెలుపున‌కు అంత ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 29, 2022 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

24 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

53 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago