Political News

మంత్రయితే ఏమైనా చేయొచ్చా

లిప్త‌కాలం పాటు.. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం సామాన్యుడు అల్లాడిపోతున్న విష‌యం తెలిసిందే. రెప్ప‌పాటు కాల‌మైనా.. వైకుంఠధాముని ద‌ర్శ‌నం దొరికితే చాల‌ని త‌పించిపోతాడు. అయితే.. త‌మ‌కున్న ప్రొటోకాల్ ను అడ్డు పెట్టుకుని.. మంత్రులు.. ఇక్క‌డ రెచ్చిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. వారానికి రెండు సార్లు.. విధిగా ద‌ర్శించుకునే మంత్రులు పెరిగిపోతున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. తిరుమ‌ల‌లో హ‌ల్చ‌ల్ చేశారు. త‌న వెంట 150 మందిని తీసుకువ‌చ్చిన ఆయ‌న‌.. అంద‌రికీ .. ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని అధికారుల‌పై ఒత్తిడి చేశారు. దీంతో ఆయ‌న ఒత్తిడిని భ‌రించ‌లేని అధికారులు.. సామాన్య భ‌క్తుల‌ను గంట‌ల త‌ర‌బ‌డి.. క్యూలైన్ల‌లో కూర్చోబెట్టి.. మంత్రిగారికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. ప్ర‌స్తుతం ఇది తీవ్ర వివాదంగా మారింది.

ఏం జ‌రిగింది?

ఏపీ ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి అప్పలరాజు తిరుమలకు వచ్చారు. మంత్రి వెంట అనుచరులు భారీగా తరలివచ్చారు. అయితే తన అనుచరులందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని అధికారుల‌పై మంత్రి అప్పలరాజు ఒత్తిడి చేశారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు… అనుచరుల్లో 20 మందికి ప్రొటోకాల్‌ దర్శనం కల్పించారు. మరో వందమందికి బ్రేక్‌ దర్శనం కల్పించారు. దీంతో టీటీడీ తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చానని… సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదని చెప్పారు. అయితే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం మంత్రి దూకుడును ఖండిస్తున్నాయి. అధికారం ఉంద‌ని ఇలా చేస్తారా? అని మండిప‌డుతున్నాయి.

This post was last modified on July 28, 2022 1:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Appala raju

Recent Posts

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

41 minutes ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

3 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

3 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

4 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

8 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

8 hours ago