Political News

మంత్రయితే ఏమైనా చేయొచ్చా

లిప్త‌కాలం పాటు.. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం సామాన్యుడు అల్లాడిపోతున్న విష‌యం తెలిసిందే. రెప్ప‌పాటు కాల‌మైనా.. వైకుంఠధాముని ద‌ర్శ‌నం దొరికితే చాల‌ని త‌పించిపోతాడు. అయితే.. త‌మ‌కున్న ప్రొటోకాల్ ను అడ్డు పెట్టుకుని.. మంత్రులు.. ఇక్క‌డ రెచ్చిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. వారానికి రెండు సార్లు.. విధిగా ద‌ర్శించుకునే మంత్రులు పెరిగిపోతున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. తిరుమ‌ల‌లో హ‌ల్చ‌ల్ చేశారు. త‌న వెంట 150 మందిని తీసుకువ‌చ్చిన ఆయ‌న‌.. అంద‌రికీ .. ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని అధికారుల‌పై ఒత్తిడి చేశారు. దీంతో ఆయ‌న ఒత్తిడిని భ‌రించ‌లేని అధికారులు.. సామాన్య భ‌క్తుల‌ను గంట‌ల త‌ర‌బ‌డి.. క్యూలైన్ల‌లో కూర్చోబెట్టి.. మంత్రిగారికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. ప్ర‌స్తుతం ఇది తీవ్ర వివాదంగా మారింది.

ఏం జ‌రిగింది?

ఏపీ ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి అప్పలరాజు తిరుమలకు వచ్చారు. మంత్రి వెంట అనుచరులు భారీగా తరలివచ్చారు. అయితే తన అనుచరులందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని అధికారుల‌పై మంత్రి అప్పలరాజు ఒత్తిడి చేశారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు… అనుచరుల్లో 20 మందికి ప్రొటోకాల్‌ దర్శనం కల్పించారు. మరో వందమందికి బ్రేక్‌ దర్శనం కల్పించారు. దీంతో టీటీడీ తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చానని… సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదని చెప్పారు. అయితే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం మంత్రి దూకుడును ఖండిస్తున్నాయి. అధికారం ఉంద‌ని ఇలా చేస్తారా? అని మండిప‌డుతున్నాయి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago