Bandi Sanjay
తెలంగాణ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. డేటే లేటు.. ఇది కన్ఫర్మ్ కాగానే ఆయనను పార్టీలో చేర్చేసుకుంటాం అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే బీజేపీలోకి చేరనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ ఎస్పై అవినీతిపై పోరాటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నమ్మి కలిసివచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో టీఆర్ ఎస్ కోవర్టు రాజకీయాలను ముందు నుంచీ వ్యతిరేకించిన వ్యక్తి రాజగోపాల్రెడ్డి అని తెలిపారు.
తొందరలోనే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతారని సమచారం వచ్చింది. త్వరలోనే డేట్ను ప్రకటిస్తాం. ఆయన రాకతో బీజేపీ ఇంకా బలపడుతోంది. ప్రజల్లో ఇంకా నమ్మకం ఏర్పడుతోంది. అని బండి వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.
మలివిడత పాదయాత్ర సన్నాహక సమావేశం పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆగస్టు 2నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర ఏర్పాట్లపై కమిటీ బాధ్యులతో బండి సంజయ్ చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన మార్పు వచ్చిందన్న సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, టీఆర్ ఎస్ తక్కువ అంచనా వేశాయని తెలిపారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
This post was last modified on July 27, 2022 9:20 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…