Political News

జనం లేని.. జ‌గ‌న‌న్న ప‌ర్య‌ట‌న‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి ఆయ‌న పార్టీ వైసీపీనాయ‌కులు చాలా గొప్ప‌గా చెబుతారు. జ‌గ‌న్ ఎక్క‌డ అడుగు పెట్టినా.. భారీ సంఖ్య‌లో జ‌నాలు వ‌స్తార‌ని.. ఇసుక వేసినప్ప‌టికీ రాల‌ద‌ని.. చాలా చాలా వ‌ర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నిక‌ల‌కు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్క‌డా అలాంటి జోష్‌ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చాలా చోట్ల జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌భ‌ల‌కు డ్వాక్రా మ‌హిళా సంఘాలను త‌ర‌లించాల్సి వ‌చ్చింది. ఎందుకంటే.. ఆయా ప్రాంతాల్లో నాయ‌కులు చాలా క‌ష్టప‌డి ప్ర‌జ‌ల‌ను తీసుకువ‌చ్చినా.. స‌భ‌లో కూర్చోలేదు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ప్రారంభించ‌గానో.. మ‌ధ్య‌లోనే కుర్చీల‌న్నీ ఖాళీ అయ్యాయి. దీంతో డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆయా స‌భ‌ల‌కు త‌ర‌లించారు. ఇక‌, తాజాగా ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అదేస‌మ‌స్య ఎదురైంది.. ఎక్క‌డా కూడా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్ళారు.

తొలుత పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ఆయన ఇవాళ ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.

అలాగే మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడ వరద బాధుతులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం పర్యటించిన తరవాత సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అయితే.. జ‌గ‌న్ ఎక్క‌డికి వెఎళ్లినా.. కేవ‌లం ప‌ది మంది పార్టీ స్థానిక నాయ‌కులు.. ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు.. భారీ సంఖ్య‌లో పోలీసులు మాత్ర‌మే ద‌ర్శ‌న‌మిస్తున్నారు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు:

జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌లో ఎప్పుడూ మీడియాకు స్కోపు ఇస్తారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మాట్లాడుతున్న మాట‌లు వివాదం అవుతుండ‌డంతో ఈ ద‌ఫా ప్రైవేటు మీడియాను అనుమ‌తించ‌లేదు. కేవ‌లం ఫొటో గ్రాఫ‌ర్లు, ప్రింట్ మీడియా రిపోర్ట‌ర్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించారు. ప్ర‌భుత్వ మీడియాను వెంట తీసుకువెళ్లారు.

This post was last modified on July 26, 2022 2:46 pm

Share

Recent Posts

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

13 minutes ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

1 hour ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

3 hours ago

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

4 hours ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

7 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

8 hours ago