Political News

జనం లేని.. జ‌గ‌న‌న్న ప‌ర్య‌ట‌న‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి ఆయ‌న పార్టీ వైసీపీనాయ‌కులు చాలా గొప్ప‌గా చెబుతారు. జ‌గ‌న్ ఎక్క‌డ అడుగు పెట్టినా.. భారీ సంఖ్య‌లో జ‌నాలు వ‌స్తార‌ని.. ఇసుక వేసినప్ప‌టికీ రాల‌ద‌ని.. చాలా చాలా వ‌ర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నిక‌ల‌కు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్క‌డా అలాంటి జోష్‌ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చాలా చోట్ల జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌భ‌ల‌కు డ్వాక్రా మ‌హిళా సంఘాలను త‌ర‌లించాల్సి వ‌చ్చింది. ఎందుకంటే.. ఆయా ప్రాంతాల్లో నాయ‌కులు చాలా క‌ష్టప‌డి ప్ర‌జ‌ల‌ను తీసుకువ‌చ్చినా.. స‌భ‌లో కూర్చోలేదు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ప్రారంభించ‌గానో.. మ‌ధ్య‌లోనే కుర్చీల‌న్నీ ఖాళీ అయ్యాయి. దీంతో డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆయా స‌భ‌ల‌కు త‌ర‌లించారు. ఇక‌, తాజాగా ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అదేస‌మ‌స్య ఎదురైంది.. ఎక్క‌డా కూడా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్ళారు.

తొలుత పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ఆయన ఇవాళ ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.

అలాగే మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడ వరద బాధుతులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం పర్యటించిన తరవాత సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అయితే.. జ‌గ‌న్ ఎక్క‌డికి వెఎళ్లినా.. కేవ‌లం ప‌ది మంది పార్టీ స్థానిక నాయ‌కులు.. ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు.. భారీ సంఖ్య‌లో పోలీసులు మాత్ర‌మే ద‌ర్శ‌న‌మిస్తున్నారు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు:

జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌లో ఎప్పుడూ మీడియాకు స్కోపు ఇస్తారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మాట్లాడుతున్న మాట‌లు వివాదం అవుతుండ‌డంతో ఈ ద‌ఫా ప్రైవేటు మీడియాను అనుమ‌తించ‌లేదు. కేవ‌లం ఫొటో గ్రాఫ‌ర్లు, ప్రింట్ మీడియా రిపోర్ట‌ర్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించారు. ప్ర‌భుత్వ మీడియాను వెంట తీసుకువెళ్లారు.

This post was last modified on July 26, 2022 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 hour ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

3 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

6 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

6 hours ago