Political News

జనం లేని.. జ‌గ‌న‌న్న ప‌ర్య‌ట‌న‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి ఆయ‌న పార్టీ వైసీపీనాయ‌కులు చాలా గొప్ప‌గా చెబుతారు. జ‌గ‌న్ ఎక్క‌డ అడుగు పెట్టినా.. భారీ సంఖ్య‌లో జ‌నాలు వ‌స్తార‌ని.. ఇసుక వేసినప్ప‌టికీ రాల‌ద‌ని.. చాలా చాలా వ‌ర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నిక‌ల‌కు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్క‌డా అలాంటి జోష్‌ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చాలా చోట్ల జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌భ‌ల‌కు డ్వాక్రా మ‌హిళా సంఘాలను త‌ర‌లించాల్సి వ‌చ్చింది. ఎందుకంటే.. ఆయా ప్రాంతాల్లో నాయ‌కులు చాలా క‌ష్టప‌డి ప్ర‌జ‌ల‌ను తీసుకువ‌చ్చినా.. స‌భ‌లో కూర్చోలేదు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ప్రారంభించ‌గానో.. మ‌ధ్య‌లోనే కుర్చీల‌న్నీ ఖాళీ అయ్యాయి. దీంతో డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆయా స‌భ‌ల‌కు త‌ర‌లించారు. ఇక‌, తాజాగా ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అదేస‌మ‌స్య ఎదురైంది.. ఎక్క‌డా కూడా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్ళారు.

తొలుత పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ఆయన ఇవాళ ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.

అలాగే మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడ వరద బాధుతులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం పర్యటించిన తరవాత సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అయితే.. జ‌గ‌న్ ఎక్క‌డికి వెఎళ్లినా.. కేవ‌లం ప‌ది మంది పార్టీ స్థానిక నాయ‌కులు.. ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు.. భారీ సంఖ్య‌లో పోలీసులు మాత్ర‌మే ద‌ర్శ‌న‌మిస్తున్నారు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు:

జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌లో ఎప్పుడూ మీడియాకు స్కోపు ఇస్తారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మాట్లాడుతున్న మాట‌లు వివాదం అవుతుండ‌డంతో ఈ ద‌ఫా ప్రైవేటు మీడియాను అనుమ‌తించ‌లేదు. కేవ‌లం ఫొటో గ్రాఫ‌ర్లు, ప్రింట్ మీడియా రిపోర్ట‌ర్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించారు. ప్ర‌భుత్వ మీడియాను వెంట తీసుకువెళ్లారు.

This post was last modified on July 26, 2022 2:46 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

14 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago