Political News

మ‌మ‌త.. మ‌మ‌తే! ఫైర్‌.. ఫైరే..!!

దేశంలోని 28 మంది ముఖ్య‌మంత్రుల్లో బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఉన్న పేరు.. బ్రాండ్ స‌ప‌రేటు. ఆమె నోరు విప్పితే.. నిప్పులు రాలాల్సిందే. ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌ల జ‌డివాన కుర‌వాల్సిందే. అంతేకాదు.. ఒక్కొక్క‌సారి త‌న వారైనా స‌రే.. మ‌మ‌త ఫైర్ మామూలుగా ఉండ‌దు. ఇప్పుడు అదే దూకుడు.. త‌న సొంత కేబినెట్ మంత్రి.. ఆమెకు అత్యంత ప్రియ‌మైన నేత పార్థా ఛ‌ట‌ర్జీపై చూపించారు. ఆయ‌న‌కు జీవిత ఖైదు విధించినా సంతోష‌మేన‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ కేసును అత్యంత వేగంగా కొలిక్కి తేవాల‌ని ఈడీకి సూచించారు. దీంతో ద‌టీజ్‌.. మ‌మ‌త‌! అనేకామెంట్లు కురుస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాల్లో దాదాపు 21 కోట్ల రూపాయలతో అడ్డంగా దొరికిపోయారు బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ. సాధార‌ణంగా ఇలాంటి కేసుల్లో స‌ద‌రు నాయ‌కుల‌ను వెనుకేసుకు వ‌స్తారు. కానీ, మ‌మ‌త అలాంటి నాయ‌కురాలు కాదు క‌దా.. అందుకే ఆయ‌న‌పై ఆమె కన్నెర్ర చేశారు. మంత్రి అరెస్టైన రెండు రోజుల తర్వాత ఆమె తొలిసారి స్పందించారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు.

అందరూ ఒకేలా ఉండరన్న మమత, తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని చెప్పారు. వీలైనంత త్వరగా నిజం నిగ్గు తేలాలన్నారు. మంత్రి పార్థా ఛటర్జీ సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగిందనేది ఈడీ వాద‌న‌.

మ‌రోవైపు ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవని మమత స్పష్టం చేశారు. తాను గతంలో దుర్గా పండాల్‌ను సందర్శించినప్పుడు ఒక మహిళను పార్థా చటర్జీ స్నేహితురాలని చెప్పి పరిచయం చేశారని మమత గుర్తు చేసుకున్నారు. తానేమీ దేవతను కాదని, ఎవరి స్నేహితులు ఎలాంటి వారో తనకెలా తెలుస్తుందని మమత ప్రశ్నించారు. మరోవైపు పార్థా ఛటర్జీని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని కోల్‌కతా ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.

మ‌న‌ద‌గ్గ‌ర ఇలా..

మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప‌లువురు మంత్రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాడులు అయితే.. జ‌ర‌గ‌లేదు..కానీ, ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఏపీలో మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. తెలంగాణ‌లో ఓ రెడ్డి మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, ఈ ఇద్ద‌రి విష‌యంలోనూ.. సీఎంలు కానీ.. ఇత‌ర మంత్రులు కానీ.. మౌనం పాటించి.. అస్స‌లు తెలియ‌న‌ట్టే న‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. మ‌మ‌త‌కు.. మిగిలిన వారికీ తేడా!! అందుకే మ‌మ‌త.. మ‌మ‌తే.. ఫైర్ .. ఫైరే అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 26, 2022 2:06 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

11 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

13 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago