Political News

మ‌మ‌త.. మ‌మ‌తే! ఫైర్‌.. ఫైరే..!!

దేశంలోని 28 మంది ముఖ్య‌మంత్రుల్లో బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఉన్న పేరు.. బ్రాండ్ స‌ప‌రేటు. ఆమె నోరు విప్పితే.. నిప్పులు రాలాల్సిందే. ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌ల జ‌డివాన కుర‌వాల్సిందే. అంతేకాదు.. ఒక్కొక్క‌సారి త‌న వారైనా స‌రే.. మ‌మ‌త ఫైర్ మామూలుగా ఉండ‌దు. ఇప్పుడు అదే దూకుడు.. త‌న సొంత కేబినెట్ మంత్రి.. ఆమెకు అత్యంత ప్రియ‌మైన నేత పార్థా ఛ‌ట‌ర్జీపై చూపించారు. ఆయ‌న‌కు జీవిత ఖైదు విధించినా సంతోష‌మేన‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ కేసును అత్యంత వేగంగా కొలిక్కి తేవాల‌ని ఈడీకి సూచించారు. దీంతో ద‌టీజ్‌.. మ‌మ‌త‌! అనేకామెంట్లు కురుస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాల్లో దాదాపు 21 కోట్ల రూపాయలతో అడ్డంగా దొరికిపోయారు బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ. సాధార‌ణంగా ఇలాంటి కేసుల్లో స‌ద‌రు నాయ‌కుల‌ను వెనుకేసుకు వ‌స్తారు. కానీ, మ‌మ‌త అలాంటి నాయ‌కురాలు కాదు క‌దా.. అందుకే ఆయ‌న‌పై ఆమె కన్నెర్ర చేశారు. మంత్రి అరెస్టైన రెండు రోజుల తర్వాత ఆమె తొలిసారి స్పందించారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు.

అందరూ ఒకేలా ఉండరన్న మమత, తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని చెప్పారు. వీలైనంత త్వరగా నిజం నిగ్గు తేలాలన్నారు. మంత్రి పార్థా ఛటర్జీ సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గతంలో విద్యామంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగిందనేది ఈడీ వాద‌న‌.

మ‌రోవైపు ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవని మమత స్పష్టం చేశారు. తాను గతంలో దుర్గా పండాల్‌ను సందర్శించినప్పుడు ఒక మహిళను పార్థా చటర్జీ స్నేహితురాలని చెప్పి పరిచయం చేశారని మమత గుర్తు చేసుకున్నారు. తానేమీ దేవతను కాదని, ఎవరి స్నేహితులు ఎలాంటి వారో తనకెలా తెలుస్తుందని మమత ప్రశ్నించారు. మరోవైపు పార్థా ఛటర్జీని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని కోల్‌కతా ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది.

మ‌న‌ద‌గ్గ‌ర ఇలా..

మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప‌లువురు మంత్రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాడులు అయితే.. జ‌ర‌గ‌లేదు..కానీ, ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఏపీలో మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. తెలంగాణ‌లో ఓ రెడ్డి మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, ఈ ఇద్ద‌రి విష‌యంలోనూ.. సీఎంలు కానీ.. ఇత‌ర మంత్రులు కానీ.. మౌనం పాటించి.. అస్స‌లు తెలియ‌న‌ట్టే న‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. మ‌మ‌త‌కు.. మిగిలిన వారికీ తేడా!! అందుకే మ‌మ‌త.. మ‌మ‌తే.. ఫైర్ .. ఫైరే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago