Political News

రోడ్లు వేసేందుకు డ‌బ్బులు లేవు.. 15 వ‌ర‌కు ఆగండి: మంత్రి

ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌పై ఎదురు దాడి చేయిస్తున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌లను మాత్రం ప్ర‌భుత్వం ఆప‌లేక పోతోంది. నాయ‌కులు ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు ర‌హ‌దారుల దుస్థితిపై నిల‌దీస్తున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కులు నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌ల్లో ర‌హ‌దారుల దుస్తితి కూడా ఒక‌టి.. ర‌హ‌దారులు బాగోలేద‌ని.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని.. ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఈ నిల‌దీత‌ల‌పై వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఒక్కొక్క ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌హ‌దారుల‌పై ప్ర‌శ్నించ‌ని ప్ర‌జ‌ల విష‌యంలో ఆయ‌న ఫైర‌య్యారు.

“అవును.. నిజ‌మే.. ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు” అని స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రోడ్లు లేక‌పోతే.. మాత్రం న‌డ‌వ‌లేరా? అని ఎదురు ప్ర‌శ్నించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌తో ఇలా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

“ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. ఏం చేయ‌మంటారు. అందుకే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదు” అని ప్రజలకు నిర్మొహ‌మాటంగా చెప్పేశారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని స్వయంగా చెప్పిన ఆయన ఆగస్టు 15న నిధులు వస్తాయని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని.. హామీ ఇచ్చారు. అయితే దీనిపైనా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను నిల‌దీయ‌డంతో గ‌తంలో శ్ర‌మ‌దానం చేసుకున్నారుగా.. అంటూ.. అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

This post was last modified on July 25, 2022 6:10 pm

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

54 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

4 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

5 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

6 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

6 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago