ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఎదురు దాడి చేయిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చే విమర్శలను మాత్రం ప్రభుత్వం ఆపలేక పోతోంది. నాయకులు ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు రహదారుల దుస్థితిపై నిలదీస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రధాన విమర్శల్లో రహదారుల దుస్తితి కూడా ఒకటి.. రహదారులు బాగోలేదని.. తమ పరిస్థితి ఏంటని.. ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నిలదీతలపై వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రహదారులపై ప్రశ్నించని ప్రజల విషయంలో ఆయన ఫైరయ్యారు.
“అవును.. నిజమే.. ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు” అని స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రోడ్లు లేకపోతే.. మాత్రం నడవలేరా? అని ఎదురు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
“ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఏం చేయమంటారు. అందుకే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదు” అని ప్రజలకు నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని స్వయంగా చెప్పిన ఆయన ఆగస్టు 15న నిధులు వస్తాయని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని.. హామీ ఇచ్చారు. అయితే దీనిపైనా ప్రజలు ఆయనను నిలదీయడంతో గతంలో శ్రమదానం చేసుకున్నారుగా.. అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
This post was last modified on July 25, 2022 6:10 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…