తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళసైల మధ్య మరింత గ్యాప్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని గవ ర్నర్.. రుసరుస లాడుతున్నారు. ఇక, ఆమె గవర్నర్గా కాకుండా.. మోడీ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్నా రనేది కేసీఆర్ భావన. కౌశిక్రెడ్డి వ్యవహారం నుంచి ఇలా.. ఇరు పక్షాల మధ్య దుమారం కొనసాగుతూనే ఉంది.
ఇక, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సమయంలో ఒకింత కలిసినట్టు కనిపించినా.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఈ ఇరువురు నేతల మద్య ఉన్న వివాదాలు మరింత పెరుగుతున్నాయనే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళసై, కేసీఆర్ లు విడివిడిగా పర్యటించారు. వాస్తవానికి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. గవర్నర్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది.
అయితే.. నేరుగా గవర్నర్ రంగంలోకి దిగిపోయి.. భద్రాచలంలో పర్యటించడం.. వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇక, ఇప్పుడు తాజాగా గవర్నర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారనే చెప్పాలి. రాజకీయాలు మాట్లాడను అంటూనే కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఇమడలేరని అంటూనే కేంద్రంలో కేసీఆర్ రాజకీయాలు సాగవని.. హెచ్చరించారు. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నట్టు చెప్పారు.
“నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొటోకాల్ ఆశించడం లేదు. సీఎంగా ఆయనకు ఉన్న హక్కులు ఉంటే.. నాకు గవర్నర్గా పర్యటించే హక్కు.. ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై నేను బరస్ట్ కాను. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఆటలు సాగవు. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు కోసమే ఆయన మోడీని విమర్శిస్తున్నారు. ఈ ప్రయత్నం వృథా” అని తమిళ సై వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. ఈ రెండు పక్షాల మధ్య దూరం మరింత పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 25, 2022 5:27 pm
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…