తమిళనాట సంచలనం రేపిన తండ్రీ కొడుకులు జయరాజ్, ఫీనిక్స్ల లాకప్ డెత్ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసును విచారించేందుకు జడ్జి నేతృత్వంలో హైకోర్టు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ జడ్జి విచారణ కోసం శాతంకులం పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడి పోలీసులెవ్వరూ ఆయనకు సహకరించకపోవడంతో ఆ పోలీస్ స్టేషన్ను మీ అధీనంలోకి తీసుకోండంటూ రెవెన్యూ విభాగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్కు అప్పగించడం తెలిసిన సంగతే. ఐతే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి జడ్జి సమర్పించిన నివేదికే కారణం. ఆ నివేదికలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఓ మహిళా పోలీసు ముందుకొచ్చింది.
ఐతే ఆమెను వాళ్లందరూ తీవ్రంగా భయపెట్టారని.. ఐతే జడ్జి ఆమెను అనునయించి భయం పోగొట్టి వాంగ్మూలం తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. విచారణలో భాగంగా పోలీసుల్ని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వలేదని.. పెడసరంగా మాట్లాడారని.. సహకరించే ఉద్దేశం లేనట్లుగా హావభావాలు ఇచ్చారని.. ఒక కానిస్టేబుల్ అయితే.. మీరు నన్నేమీ చేయలేరంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారని జడ్జి నివేదికలో పేర్కొన్నారు. ఇక స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ కోసం ప్రయత్నించగా.. ఏ రోజుకు ఆరోజు ఫుటేజీ అంతా డెలీట్ అయిపోయేలా సెట్టింగ్స్ మార్చేశారని.. సిస్టంలో భారీగా మెమొరీ ఉన్నప్పటికీ.. ఇలా ఫుటేజీ ఏ రోజుకు ఆరోజు వెళ్లిపోయేలా సెట్టింగ్స్ పెట్టడంలో పోలీసుల ఆంతర్యమేంటో అర్థమవుతోందని జడ్జి నివేదికలో స్పష్టం చేశారు. ఈ నివేదిక చదివిన హైకోర్టు పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేషన్ను రెవెన్యూ సిబ్బంది అధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.
This post was last modified on July 2, 2020 1:40 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…