తమిళనాట సంచలనం రేపిన తండ్రీ కొడుకులు జయరాజ్, ఫీనిక్స్ల లాకప్ డెత్ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసును విచారించేందుకు జడ్జి నేతృత్వంలో హైకోర్టు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ జడ్జి విచారణ కోసం శాతంకులం పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడి పోలీసులెవ్వరూ ఆయనకు సహకరించకపోవడంతో ఆ పోలీస్ స్టేషన్ను మీ అధీనంలోకి తీసుకోండంటూ రెవెన్యూ విభాగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్కు అప్పగించడం తెలిసిన సంగతే. ఐతే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి జడ్జి సమర్పించిన నివేదికే కారణం. ఆ నివేదికలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఓ మహిళా పోలీసు ముందుకొచ్చింది.
ఐతే ఆమెను వాళ్లందరూ తీవ్రంగా భయపెట్టారని.. ఐతే జడ్జి ఆమెను అనునయించి భయం పోగొట్టి వాంగ్మూలం తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. విచారణలో భాగంగా పోలీసుల్ని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వలేదని.. పెడసరంగా మాట్లాడారని.. సహకరించే ఉద్దేశం లేనట్లుగా హావభావాలు ఇచ్చారని.. ఒక కానిస్టేబుల్ అయితే.. మీరు నన్నేమీ చేయలేరంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారని జడ్జి నివేదికలో పేర్కొన్నారు. ఇక స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీ కోసం ప్రయత్నించగా.. ఏ రోజుకు ఆరోజు ఫుటేజీ అంతా డెలీట్ అయిపోయేలా సెట్టింగ్స్ మార్చేశారని.. సిస్టంలో భారీగా మెమొరీ ఉన్నప్పటికీ.. ఇలా ఫుటేజీ ఏ రోజుకు ఆరోజు వెళ్లిపోయేలా సెట్టింగ్స్ పెట్టడంలో పోలీసుల ఆంతర్యమేంటో అర్థమవుతోందని జడ్జి నివేదికలో స్పష్టం చేశారు. ఈ నివేదిక చదివిన హైకోర్టు పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టేషన్ను రెవెన్యూ సిబ్బంది అధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.
This post was last modified on July 2, 2020 1:40 am
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…