Political News

జైలుకు వెళ్లి వ‌చ్చిన వారు నీతులు చెబుతారా? : కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ అస‌మ్మ‌తి మునుగోడు ఎమ్మెల్యే , తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రెండు విష‌యాల‌ను క్లియ‌ర్‌గా చెప్పేశారు. తాను పార్టీ మారుతున్న‌ట్టు.. బీజేపీ కండువా వేసుకుంటున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించిన‌ట్టే ఖండించి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే త‌ప్పులేద‌ని చెప్పేశారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

జైలుకు వెళ్లివ‌చ్చిన నేత‌ల‌తో నీతులు చెప్పించుకునే(ఓటుకు నోటు కేసులో) ప‌రిస్థితిలో తాను లేన‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినప్పుడు.. రాజకీయ, రాజీనామా అంశాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు. పార్టీ మారాల్సి వస్తే.. స్థానిక ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని గతంలోనే చెప్పానని.. ఇప్పటికి అదే మాటకు కట్టుబడి ఉన్నానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

సమయం వచ్చినపుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని రాజ‌గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ వ్యూహంలో తాను పావును కాదల్చుకోలేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయన్న రాజగోపాల్.. ఆ పార్టీ బలహీనపడిందన్నారు. కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారితో తాను నీతులు చెప్పిం చుకోలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“పార్టీ మారుతున్నానంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందరి సమక్షంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశాను. రాజకీయ, రాజీనామా అంశాలు మా మధ్య చర్చకు రాలేదు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం అప్పుల పాల్జేసిందని వివరించా. ఉప ఎన్నిక వస్తుందని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. గట్టుప్పల్‌ను మండలం చేసి నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత టీఆర్ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే గెలవాలని సీఎం కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదు. కాంగ్రెస్‌ అంటే అభిమానం.. సోనియా అంటే గౌరవం. కాంగ్రెస్‌ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నేను ఏమీ అనలేదు. ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్‌ బాధ్యతలు ఇచ్చారు.” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 25, 2022 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

2 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

2 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

3 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

3 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

5 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

7 hours ago