Political News

జైలుకు వెళ్లి వ‌చ్చిన వారు నీతులు చెబుతారా? : కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ అస‌మ్మ‌తి మునుగోడు ఎమ్మెల్యే , తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రెండు విష‌యాల‌ను క్లియ‌ర్‌గా చెప్పేశారు. తాను పార్టీ మారుతున్న‌ట్టు.. బీజేపీ కండువా వేసుకుంటున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించిన‌ట్టే ఖండించి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే త‌ప్పులేద‌ని చెప్పేశారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

జైలుకు వెళ్లివ‌చ్చిన నేత‌ల‌తో నీతులు చెప్పించుకునే(ఓటుకు నోటు కేసులో) ప‌రిస్థితిలో తాను లేన‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినప్పుడు.. రాజకీయ, రాజీనామా అంశాలు చర్చకు రాలేదని ఆయన తెలిపారు. పార్టీ మారాల్సి వస్తే.. స్థానిక ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని గతంలోనే చెప్పానని.. ఇప్పటికి అదే మాటకు కట్టుబడి ఉన్నానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.

సమయం వచ్చినపుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటానని రాజ‌గోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ వ్యూహంలో తాను పావును కాదల్చుకోలేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయన్న రాజగోపాల్.. ఆ పార్టీ బలహీనపడిందన్నారు. కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని పేర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారితో తాను నీతులు చెప్పిం చుకోలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“పార్టీ మారుతున్నానంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందరి సమక్షంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశాను. రాజకీయ, రాజీనామా అంశాలు మా మధ్య చర్చకు రాలేదు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం అప్పుల పాల్జేసిందని వివరించా. ఉప ఎన్నిక వస్తుందని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. గట్టుప్పల్‌ను మండలం చేసి నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత టీఆర్ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే గెలవాలని సీఎం కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదు. కాంగ్రెస్‌ అంటే అభిమానం.. సోనియా అంటే గౌరవం. కాంగ్రెస్‌ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నేను ఏమీ అనలేదు. ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్‌ బాధ్యతలు ఇచ్చారు.” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 25, 2022 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

1 hour ago

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

5 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

8 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

9 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

10 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

11 hours ago